టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్, యువ దర్శకుడు పరశురామ్ పెట్ల ల తొలి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట ఇటీవల దుబాయ్ లో ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ కి జోడీగా మహానటి ఫేమ్ కీర్తి సురేష్ తొలిసారిగా జత కడుతున్న ఈ భారీ ప్రతిష్టాత్మక మూవీని 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మస్తున్నాయి. మహేష్ బాబు ఈ మూవీలో ఒక ఫైనాన్షియర్ పాత్ర చేస్తున్నట్లు సమాచారం.

యువ సెన్సేషన్ థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి మది ఫోటోగ్రఫి అందిస్తున్నారు. ఇక ఈ మూవీ లోని తన పాత్ర కోసం ఇప్పటికే లాంగ్ హెయిర్ పెంచడంతో పాటు బాడీ ఫిట్నెస్ ని కూడా పూర్తిగా మెయిన్ టెయిన్ చేస్తున్నారు మహేష్. మంచి మెసేజ్ తో పాటు పలు కమర్షియల్ హంగుల కలబోతగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సూపర్ స్టార్ కృష్ణ ఒక కీలక పాత్ర చేస్తున్నట్లు లేటెస్ట్ ఫిలిం నగర్ వర్గాల టాక్. నిజానికి ఈ వార్త కొన్నాళ్ల క్రితం ప్రచారం అయినప్పటికీ దీనిపై యూనిట్ నుండి ఎటువటిని స్పందన రాలేదు. 

అయితే సర్కారు వారి పాట మూవీ కి చెందిన యూనిట్ లోని ఒకరు ఈ న్యూస్ ని ఇటీవల లీక్ చేసారని అంటున్నారు. అయితే ఇప్పుడు కూడా మరొకసారి ప్రచారం అవుతున్న ఈ వార్తపై పక్కాగా దర్శకనిర్మాతల నుండి ప్రకటన రావాల్సిందే అని అప్పటివరకు దీనిని విశ్వసించలేమని అంటున్నారు విశ్లేషకులు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజం అయితే ఎప్పటినుండో ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ ని ఒకే తెరపై చూడాలని భావిస్తున్న వారి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఇది మంచి పండుగ న్యూస్ అనే చెప్పాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: