టాలీవుడ్ సినిమా పరిశ్రమ ఇటీవల కరోనా మహమ్మారి కారణంగా విధించబడిన లాక్ డౌన్ తరువాత వరుసగా రిలీజ్ అవుతున్న సినిమాలతో పలు సక్సెస్ లు అందుకుంటూ కళకళలాడుతోంది అనే చెప్పాలి. ముందుగా ఈ ఏడాది మాస్ రాజా రవితేజ, యువ దర్శకుడు గోపీచంద్ మలినేని ల దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ మూవీ తో సూపర్ హిట్ రుచిచూసిన టాలీవుడ్ ఆపై రెడ్, ఉప్పెన, జాంబీ రెడ్డి వంటి సినిమాలతో మరింత జోష్ తో పరుగెడుతోంది.

అసలు మ్యాటర్ ఏమిటంటే, ఇటీవల కామెడీ స్టార్ అల్లరి నరేష్ హీరోగా యువ దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన నాంది సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ ని దక్కించుకుని ప్రస్తుతం అన్ని సెంటర్స్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకెళుతోంది. మంచి యాక్షన్ తో కూడిన ఈ ఎమోషనల్ ఎంటర్టైనర్ లో హీరో అల్లరి నరేష్ తనలోని మరొక కోణాన్ని వెలికి తీశారు. గమ్యం ,నేను, మహర్షి సినిమాల తరువాత నరేష్ కి నాంది మూవీ ద్వారా నటుడిగా మరింత గొప్ప పేరు దక్కింది. కోలీవుడ్ సంచలన నటి వరలక్ష్మి శరత్ కుమార్,  ప్రవీణ్, ప్రియదర్శి తదితరులు ఇతర పాత్రలు చేసిన ఈ సినిమాలో అల్లరి నరేష్, సూర్య ప్రకాష్ అనే సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ పాత్రలో నటించారు. 

అనుకోకుండా ఒక కేసులో ఇరికించబడి దాదాపుగా ఐదేళ్ల పాటు జైల్లోనే జీవితం గడిపిన ఒక ఒక యువకుడు ఆ తరువాత తన నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకుని ఆపై తనని ఇరికించిన వారిపై ఏ విధంగా రివెంజ్ తీర్చుకున్నాడు అనే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. ఇక ఈ మూవీలోని తన పాత్ర కోసం అల్లరి నరేష్ పడ్డ శ్రమ వర్ణనాతీతం అని, ఇక డబ్బింగ్ విషయమై కూడా నరేష్ ఎంతో కష్టపడ్డారని ఇటీవల దర్శకనిర్మాతలు, పలువురు ఇతర నటులు మాట్లాడుతూ చెప్పారు. మొత్తానికి ఎంతో కష్టపడ్డ నరేష్ కి ఈ మూవీ ఫైనల్ గా సూపర్ హిట్ కొట్టి ఆయనకు మంచి గుర్తింపునిచ్చిందని పలువురు ప్రేక్షకులు యూనిట్ కి అభినందనలు తెలియచేస్తూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: