క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ క‌ళ్యాన్ క‌థానాయ‌కుడిగా ఓ సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. వ‌కీల్‌సాబ్ త‌ర్వాత ప‌వ‌న్ చేయ‌బోతున్న సినిమా ఇదే. ఇప్ప‌టికే ఈసినిమా తొలి షెడ్యూల్‌కు చిత్రం బృందం ప్లాన్ చేసింది.  ఎ.ఎమ్‌.రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం 17వ శతాబ్దాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దిన ఓ ప్రత్యేక సెట్‌లో చిత్రీకరణ జరుపుకొంటోంది. యాక్షన్‌ ఘట్టాల్ని రూపొందిస్తున్నారు.  పవన్‌ కల్యాణ్‌ సరసన నిధి అగర్వాల్‌ నటిస్తోంది. బాలీవుడ్‌ తారలు అర్జున్‌ రాంపాల్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా పేరుని మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రకటిస్తార‌ని స‌మాచారం. పేరుతోపాటే ఫస్ట్‌లుక్‌ని కూడా విడుదల చేయనున్నారు. టైటిల్ విషయమై చిత్ర నిర్మాతలు, పవన్ కళ్యాణ్‌తో చర్చించి చివరకు 'హరిహర వీరమల్లు' అనే టైటిల్‌ ఫైనల్ చేశారని సమాచారం.


ఇదిలా ఉండ‌గా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్  షూటింగ్ పూర్తి అయింది. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా ఉన్న విష‌యం తెలిసిందే.  వేణు శ్రీరామ్ దర్శకత్వం వ‌హించారు. ఈ సినిమాపై  భారీ అంచనాలున్నాయి. శృతిహాసన్‌, అంజలి, నివేథా థామస్‌, అనన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.  ఈ సినిమాను హిందీ మూవీ పింక్‌కు రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ గెటప్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. ఆ టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అయితే.. తాజాగా వకీల్‌సాబ్‌ మూవీ నుంచి మరో అప్డేట్‌ వచ్చేసింది. ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ను చిత్ర బృందం అఫిషీయల్‌గా ప్రకటించేసింది.


ఈ ఏడాది ఏప్రిల్‌ 9న ఈ సినిమాను థియేటర్లలో వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేయనున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా చిత్ర బృందం రిలీజ్‌ చేసింది. ఈ అప్టేట్‌తో పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ పండగా చేసుకుంటున్నారు. కాగా...  ఈ సినిమా తర్వాత పవన్‌ మలయాళ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. రెండేళ్ల రాజకీయ ప్రయాణం చేశాక ఇటీవలే తిరిగి కెమెరా ముందుకొచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వరుస సినిమాలకు కమిటైన సంగతి తెలిసిందే. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా అటు రాజకీయాలు, ఇటు సినిమా షూటింగ్స్ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు పవన్.

మరింత సమాచారం తెలుసుకోండి: