ఓ చిత్రం హిట్ అయితే చాలు.. ఇక ఆ సినిమాని పలు భాషల్లో రీమేక్ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు పలువురు దర్శకులు మరియు నిర్మాతలు. కంటెంట్ బాగుంటే చాలు ఇక రీమేక్ రైట్స్ కోసం క్యూలు కట్టేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు మరియు తమిళ సినిమాలు హిందీలో రీమేక్ కాబోతున్నాయి. అదే విధంగా తెలుగు సినిమాలు తమిళం లోనూ రీమేక్ కు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు ఆ చిత్రాలేవో ఓ లుక్కేద్దాం. మెగా హీరో వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉప్పెన సినిమా వసూళ్ల సునామీ తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సూపర్ హిట్ చిత్రాన్ని ఇటు హిందీ, అటు తమిళంలోనూ రీమిక్స్ చేయబోతున్నట్లు సమాచారం.

ఇప్పటికే రీమిక్ హక్కులు కూడా అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ఇక ఆయా భాషలకు తగ్గట్టుగా హీరోలను ఎంపిక చేయబోతుండగా, విలన్ క్యారెక్టర్ కు మాత్రం రెండు భాషల్లోనూ విజయ్ సేతుపతినే ఖరారు చేసినట్లు సమాచారం. మరో వైపు చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత నాంది మూవీతో ఓ సూపర్ హిట్ ను అందుకున్నాడు అల్లరి నరేష్. ఈ సినిమాతో రేసులో నిలబడ్డాడు  ఈ హీరో. అయితే ఈ సినిమా కథ అద్భుతంగా ఉండటంతో... దీనిని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు వినికిడి.
రవితేజ క్రాక్.. విజయ్ డబ్బింగ్ మూవీ మాస్టర్ సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబడుతున్నాయి.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రీమేక్ హక్కులు అమ్ముడు పోయాయి. 2019లో తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు చూస్తున్నారు. ఇలా పలు తెలుగు సినిమాలు హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రోజుల్లో కథ బాగుంటే చాలు తమ తమ భాషల్లో రీమేక్ చేసేందుకు ముందుకు వస్తున్నారు దర్శక నిర్మాతలు.  మొదటి సారిగా బాలీవుడ్ లోకి వెళ్లనున్న అల్లరి నరేష్ అక్కడ కూడా హిట్ అవుతుందా ? 

మరింత సమాచారం తెలుసుకోండి: