తాజగా ఆమె ఓ సంచలన నిర్ణయం తీసుతుంది. తాను అనుకున్నట్టుగా తన పాత్ర క్లిక్ కాకపోవడంతో కోలీవుడ్లోని యువ హీరోయిన్ ఆండ్రియా తీవ్ర నిరాశలో కూరుకుపోయిందట. ఇళయ దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం మాస్టర్లో ఒక హీరోయిన్గా ఆండ్రియా నటించింది. పాత్రకు ఎంతో ప్రాధాన్యత వుందని చెప్పడంతో ఆ పాత్రలో నటించేందుకు ఆండ్రియా స మ్మతించింది. పైగా, విజయ్ వంటి స్టార్ హీరో చిత్రంలో నటించడం వల్ల తన కెరీర్కు కూడా బాగా ఉపయోగపడుతుందని గంపెడాశలు పెట్టుకుంది. కానీ, చిత్రం విడుదలైన తర్వాతే ఆమెకు అసలు విషయం తెలియవచ్చింది. ఈ చిత్రంలో తన పాత్ర కేవలం డమ్మీలాంటిదని గ్రహించింది. ఇదే విషయాన్ని సినీ విమర్శకులు సైతం చెప్పుకొచ్చారు.
దీంతో తీవ్ర నిరాశకు లోనైన ఆండ్రియా.. ఓ కఠిన నిర్ణయం తీసుకుందట. ఇకపై కథలో తనకు ప్రాధాన్యం ఉన్నటువంటి చిత్రాల్లోనే నటించాలన్న నిర్ణయానికి వచ్చిందట. అంటే కెరీర్ ఆరంభంలో ఏవిధంగా అయితే, ఆచితూచి అడుగులు వేసిందో ఆవిధంగానే అడుగులు వేయాలని భావిస్తోంది. కాగా, ప్రస్తుతం ఆండ్రియా చేతిలో కేవలం రెండు, మూడు చిత్రాలు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒ కటి మిషికన్ దర్శకత్వం వహించే పిశాచు-2, దిల్ సత్య దర్శకత్వం వహించే మాళిగైతో పాటు కో అనే చిత్రాలు ఉన్నాయి.