టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి రెండు భాగాల సినిమాల తరువాత దేశవిదేశాల్లో కూడా అత్యద్భుతమైన క్రేజ్ ని దక్కించుకున్నాడు. పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కిన ఆ సినిమాలు కనీ వినీ ఎరుగని రీతిలో భారీ విజయాలతో పాటు అత్యద్భుతమైన కలెక్షన్స్ ని సంపాదించాయి. ఇక వాటి తరువాత సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సినిమా సాహో. ఈ సినిమాలో బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటించింది.

యువి క్రియేషన్స్ బ్యానర్ ఫై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుని ప్రభాస్ ఇమేజ్ ని మరింతగా పెంచింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ మొత్తం మూడు భారీ సినిమాలు చేస్తున్నారు. వాటిలో ఒకటి రాధాకృష్ణ దర్శకత్వంలో ుని క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ వారు రూపొందిస్తున్న రాధేశ్యామ్ కాగా మరొకటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలె ఫిలిమ్స్ వారు రూపొందిస్తున్న సలార్, అలానే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఆదిపురుష్ మూవీ. కాగా ఇవి మూడు కూడా పాన్ ఇండియా మూవీస్ గా అత్యంత భారీ వ్యయంతో రూపొందుతుండడం విశేషం. 

ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే, ఈ మూడు సినిమాలకు గాను ప్రభాస్ ఒక్కో సినిమాకు దాదాపుగా రూ.100 కోట్ల పైచిలుకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ఇప్పటికే ఆయా సినిమాల నిర్మాతలు ప్రభాస్ కు పారితోషికం విషయమై ఒప్పందం కుదుర్చుకున్నారని, ఈ విధంగా యావత్ భారతదేశంలోనే ఇప్పటివరకు ఏ హీరో అందుకోని విధంగా రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న నెంబర్ వన్ హీరోగా ప్రభాస్ సరికొత్త రికార్డు ని సృష్టించారని అంటున్నారు. కాగా ప్రస్తుతం ఈ వార్త పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: