సన్నని నడువొంపుతో.. చురకత్తుల్లాంటి చూపుతో కుర్రకారులకు నిద్రాహారాలు లేకుండా చేస్తుంటుంది రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్, బాలీవుడ్ లో ప్రస్తుతం ఈ చిన్నది ఫుల్ బిజీగా ఉంది. వరుస సినిమా ఆఫర్లను దక్కించుకుంటూ ఈ అమ్మడు తెలుగు ఇండస్ట్రీపై అగ్రకథానాయికల లీస్ట్ లో చేరిపోయింది. కొన్నేళ్ల కిందటే ఈ అమ్మడు స్టార్ స్టేటస్ ను సంపాదించుకుని.. అగ్ర కథానాయికగా చెలమాణి అవుతూ వెళుతోంది. అయితే ఆ మధ్యన తెలుగులో ఫుల్ బిజీ బ్యూటీగా మారిపోయింది. కానీ గతకొంత కాలంగా ఈ అమ్మడు తెలుగు తెరపై కనిపించడమే కరువైంది. పూర్తిగా ఈ అమ్మడుకు అవకాశాలనే కరువుయ్యాయి. ఈ చిన్నది చివరగా తెలుగులో మన్మధుడు 2 లో కనిపించింది. అది  2019 లో రిలీజ్ అయ్యింది.
భారీ అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకుల  ముందుకు వచ్చినా బాక్సాఫీస్ ముందు తుస్సు మన్నది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ అమ్మడు తెలుగు  తెరపై కనిపించలేదు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ఈ అమ్మడు యూత్ స్టార్ నితిన్ సినిమాలో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఈ హీరో నటిస్తున్న‘చెక్’ సినిమాలో నితిన్ సరసన ప్రియా ప్రకాశ్ వారియర్ కథానాయికగా నటించగా.. రకుల్ లాయల్ గా పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. అయితే ఈ చిత్ర యూనిట్ జరిపిన కార్యక్రమానికి అందరూ హాజరయ్యారు. కానీ రకుల్ మాత్రం అందులో కనిపించలేదు. ముంబైలో ఓ సినిమా షూటింగ్ లో ఈ బ్యూటీ బిజీగా ఉండటం వల్లే రాలేకపోయిందని సమాచారం. కానీ ఈ  అమ్మడుకు చాలా గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఫస్ట్ సినిమా ఇది.

అందులోనూ ఈ సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలున్నాయి. అలాంటి టైం లో ఈ అమ్మడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లేకపోవడం ఏంటని రకుల్ పై పలు విమర్శలకు దారితీస్తోంది. రకుల్ రాకపోవడంతో ఆమె అభిమానుల్లో పలు అనుమానాలు మొదలయ్యాయి. ప్రీ రిలీజ్ కు రాలేకపోయినా.. అట్లీస్ట్ ప్రెస్ మీట్ కు అన్నా రావాలి కదా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఈ చిన్నదాని ఫ్యాన్స్. ఈ సినిమా కోసం ఒక రోజు కూడా కుదర లేదా అంటూ సోషల్ మీడియా వేధికగా రకుల్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. అయితే రకుల్ చేతిలో బాలీవుడ్, కోలీవుడ్  సినిమాలు చాలానే ఉండటంతో ఈ సినిమాను లైట్ తీసుకుందేమోనని అనుకుంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: