విక్టరీ వెంకటేష్ దృశ్యం2 రీమేక్ సినిమాలో హీరోగా నటించడానికి సిద్ధమయ్యారు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన దృశ్యం సినిమాని తెలుగులో అదే పేరిట 2014 లో వెంకటేష్ రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఐతే ఈ సినిమా తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే మొదటి భాగానికి కొనసాగింపుగా డైరెక్టర్ జీతు జోసెఫ్ 6 సంవత్సరాల తర్వాత దృశ్యం 2 సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదల చేశారు. ఈ సినిమా కూడా భారత దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులను అలరించింది.


అయితే ఈ సినిమాను ఇప్పటికే చాలా మంది తెలుగు ప్రేక్షకులు చూశారు. అందుకే దృశ్యం 2 రీమేక్ ఫ్రెష్ గా ఉండటం కోసం స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని కలిగించాలని వెంకటేష్ భావిస్తున్నారు. ఇదే విషయమై తన సోదరుడు, ఈ సినిమా నిర్మాత సురేష్ బాబు తో వెంకటేష్ చర్చించారు. అయితే ఆ ఐడియా నచ్చడంతో సురేష్ బాబు కూడా స్క్రిప్ట్ లో చేంజెస్ చేసేందుకు ఓకే అన్నారు. దీనితో వెంకటేష్ కోరికమేరకు ప్రస్తుతం డైరెక్టర్ జీతూ జోసెఫ్ స్క్రిప్ట్ లో కొన్ని కీలక మార్పులు చేస్తున్నారని సమాచారం.


ఇకపోతే ఇటీవలే దృశ్యం 2 తెలుగు రీమేక్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ప్రారంభమయ్యాయి. నిజానికి ఈ సమయంలో వెంకటేష్ ఎఫ్3 సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది కానీ ఆయన దృశ్యం 2 సినిమాని త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో మిగతా సినిమాల షూటింగ్స్ మానుకున్నారు. ఈ సినిమా షూటింగ్ ని 50 రోజుల్లో పూర్తి చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. ఈ మూవీ ఏప్రిల్ నెలలోనే థియేటర్లలో రిలీజ్ కానున్నది. ఒరిజినల్ సినిమాలో మొదటి భాగం చాలా డల్ గా ఉంది కానీ వెంకటేష్ చేస్తున్న రీమేక్ ని కొంచెం కమర్షియల్ గా రూపొందిస్తే బాగుంటుంది అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మీనా, వెంకటేష్ మధ్య చోటుచేసుకునే సన్నివేశాలు.. అలాగే ఎస్తేర్ అనిల్ సన్నివేశాలను కూడా ఎంటర్టైనింగ్ గా మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: