తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో ప్రభాస్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. బాహుబలి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమను ఖ్యాతి పెంచాడు. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ రాధేశ్యాం షూటింగ్ ను ఎప్పుడో పూర్తి చేసేసాడు. కానీ, ఆ సినిమా షూటింగ్ ను ఎప్పుడో పూర్తి చేసేసుకుంది. కానీ రిలీజ్ అవడానికి ఆలస్యమైపోతోంది.

అయితే మరో వైపు సలార్, ఆదిపురుష్ షూటింగ్ లు కూడా మొదలు పెట్టేసాడు. కానీ, ఆదిపురుష్ షూటింగ్ కి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. షూటింగ్ మొదలు పెట్టిన రోజే ఫైర్ ఆక్సిడెంట్ అయింది. ప్రాణ నష్టం జరగలేదు కానీ, షూటింగ్ కి అవసరమైన కొన్ని పరికరాలు కాలిపోయాయి. వాటిని తిరిగి తెప్పించడానికి సమయం పడుతుంది. దీనితో, ఆదిపురుష్ షూటింగ్ వాయిదా పడింది.

ఈ తరుణంలో ప్రభాస్ కథ విని సినిమా ఒకే చేసేముందు డైరెక్టర్లకి కొన్ని కండిషన్లు పెడుతున్నాడట. ఏ సినిమాకి అయినా, కేవలం మూడు నెలలు మాత్రమే డేట్లు ఇవ్వనున్నాడట. ఆయనకు సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం కేవలం 60 రోజుల్లో పూర్తి చేయాలనీ కండిషన్ పెడుతున్నాడట. అలాగే, తానూ సైన్ చేసిన సినిమాను ఆరు నెలల్లో థియేటర్ లో రిలీజ్ చేసేయాలని మరో కండిషన్ పెడుతున్నారట. ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రూపొందుతున్న సలార్ కు ఆల్రెడీ ఈ కండిషన్ గురించి చెప్పేశారట.

అయితే ప్రశాంత్ నీల్ కూడా అందుకు సిద్ధమయ్యే ముందుకొచ్చారట. ఈ లెక్కన 2022 సంక్రాంతి కి సలార్ రిలీజ్ అయిపోతే, మరో ఆరు నెలలు అంటే.. ఆగష్టు కి ఆదిపురుష్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత 2023 కి నాగ్ అశ్విన్ సినిమా రెడీ గా ఉంటుంది. ఇలా ప్రతి ఆరు నెలలకి ఓ సినిమాను ప్రభాస్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: