‘బాహుబలి’ సినిమాలో నటించినప్పటి నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ రేంజే పూర్తిగా మారిపోయింది. ఈ ఒక్క సినిమా ప్రభాస్ లైఫ్ నే పూర్తిగా మార్చేసింది. దర్శక ధీరుడు తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్ నటించడంతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ సినిమా గ్రాండ్ గా రిలీజై ఏ రేంజ్ లో పేరు తెచ్చుకుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బహుబలి సినిమాతో ప్రభాస్ తెలుగు తెరపై కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. ప్రభాస్ క్రియేట్ చేసిన ఈ వసూళ్లను ఇప్పటి వరకు ఏ సినిమా వసూలు చేయ్యలేదు. అందుకే ప్రభాస్ ఇప్పుడు పూర్తిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.
వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులను ఓకే చేసేస్తూ.. ఒక్కోటిగా వాటిని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నంలో డార్లింగ్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక పాన్ ఇండియా స్టార్ హీరో రేంజ్ ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న రెబల్ స్టార్ రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్ కు చేరుకుంది. తెలుగు తో పాటుగా ఇతర భాషల్లో ప్రభాస్ సినిమాలకు కలెక్షన్లు బాగా వసూలు కావడంతో ప్రభాస్ తన రెమ్యూనరేషన్ను పెంచినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ ఒక్కో సినిమాకు 70 కోట్లకు పైనే రెమ్యూనరేషన్ను తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా వస్తున్న సమాచారం మేరకు.. ఈ రెబల్ స్టార్ తన రెమ్యూనరేషన్ను మరింతగా పెంచేశాడని సినీ వర్గాల గుసగుసలు మొదలయ్యాయి.

హీరో మంచి అందమైన ప్రేమ కథతో వస్తున్న‘రాధేశ్యామ్’ సినిమా తర్వాత మరో రెండు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో ఆదిపురుష్, సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చే సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఈ మూడు సినిమాలకు డార్లింగ్ ప్రభాస్ వంద కోట్ల రెమ్యూనరేషన్ను డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఒక వేళ ‘రాధేశ్యామ్’పాన్ ఇండియా వైడ్ గా మాంచి సక్సెస్ ను అందుకున్నట్టైతే తన రెమ్యూనరేషన్ను మరింతగా పెంచే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఇంత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటుంది సౌత్ లో కేవలం ప్రభాస్ మాత్రమే. ఇక అప్ కమింగ్ సినిమాలు కూడా ఘన విజయాన్ని అందుకుంటే బాలీవుడ్ స్టార్ హీరోల స్థాయిలోనే ప్రభాస్ రెమ్యూనరేషన్ తీసుకుంటారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: