తెలుగు చిత్ర పరిశ్రమలో రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమకి ఛలో సినిమాతో తెరంగ్రేటం చేసింది ఈ భామ. తన నటనతో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ భామ. వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది ఈ భామ. ఇక ఒకొనొక టైములో టాలీవుడ్ లో రష్మిక vs పూజ అన్న రేంజ్ లో వాళ్ళ మధ్యన కాంపిటీషన్ నడిచింది.

ఇక ప్రస్తుతం కూడా పూజ హెగ్డే vs రష్మిక అన్న రేంజ్ లో ఉంది వాళ్ళ ఇద్దరిని చూస్తుంటే. ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్న పూజ హెగ్డే కి పోటీగా అల్లు అర్జున్ తో పుష్ప పాన్ ఇండియా ఫిల్మ్ చేస్తుంది రష్మిక. అలా వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాక బాలీవుడ్ మూవీస్ తో పూజ హెగ్డే బిజీ అయ్యింది. రష్మిక కూడా బాలీవుడ్ లోకి అడుగుపెట్టి మూడు సినిమాలతో బిజీ అయ్యింది. మరోపక్క పూజ హెగ్డే ముంబై లో కాస్ట్లీ ప్లేస్ లో త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ కొంటే.. రీసెంట్ గా రష్మీకి కుడా ముంబైలో ఇల్లుకొనేసింది అనే టాక్ మొదలైంది.

అయితే ఈ మధ్యన మూడు భాషల్లోనూ నాటే టాలీవుడ్, బాలివుడ్, తమిళ మూవీస్ తో బిజీగా వున్న రష్మిక ముంబై షూటింగ్ కి వెళ్ళినప్పుడల్లా హోటల్ లో రూమ్ తీసుకుని ఉంటుందట. అదంతా ఎందుకు మనకి ఓ ఇల్లు ముంబైలో ఉంటే బావుంటుంది అని అనుకుందట రష్మిక. ఇక రష్మిక ముంబై లో ఖరీదైన ప్రాంతంలో విలాసవంతమైన ఫ్లాట్ ను కొనుగోలు చేసినట్లుగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఇంతకుముందే హైదరాబాద్ లో ఇంటిని కొనుగోలు చేసిన రష్మిక ఇప్పుడు ముంబై లోనూ కొత్తిల్లు కొనేసిందట. మరి ఇదంతా గమనిస్తే  పూజ హెగ్డే ఎక్కడికి వెళితే అక్కడికి రష్మిక పోటీకి వెళుతున్నట్టే కనిపించడం లేదూ.

మరింత సమాచారం తెలుసుకోండి: