సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఇద్దరూ లవ్లో ఉన్నారని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఒక ప్రైవేట్ పార్టీలో కలుసుకున్న వీళ్లిద్దరూ డీప్ రిలేషన్లోకి వెళ్లారు. అప్పటినుంచి హాలిడే ట్రిప్పులు, టూర్లతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ డేటింగ్ వ్యవహారం గురించి ఇప్పటివరకు ఓపెన్ కాలేదు సిద్ధార్థ్, కియారా.
కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా లవ్లో ఉన్నారనే ప్రచారం మొదలైనప్పటి నుంచి కెమెరా కళ్లన్ని వీళ్ల చుట్టూనే తిరుగుతున్నాయి. దీంతో కెమెరాల కంట పడకుండా ఒక రోజు రాత్రి సిద్ధార్థ్ ఇంటికి వెళ్లింది కియారా. కానీ కియారా కంటే ముందే కెమెరాలు సిద్ధార్థ్ ఇంటి ముందు వాలిపోయాయి. దీంతో కియారా కూడా ఏం చేయలేక, కెమెరాలని ఫేస్ చేయలేక యమ స్పీడ్గా సిద్ధార్థ్ ఇంటికి వెళ్లిపోయింది.
కియారా అద్వానీ బాధ చూడలేక కెమెరామెన్స్తో గొడవకు దిగాడట సిద్ధార్థ్. ఫోటోలు, వీడియోలు అన్నీ డిలీట్ చెయ్యాలని, నా ఇంటిముందు నుంచి వెళ్లిపోవాలని గోల చేశాడట. కానీ సోషల్ మీడియా జనాలు అక్కడి నుంచి వెనక్కి పోలేదు. పైగా ఈ గొడవతో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా వ్యవహారం మరింత వైరల్ అయిపోయింది.
మొత్తానికి సిద్దార్థ్ మల్హోత్రాని సోషల్ మీడియా ఓ ఆట ఆడుకుంటోంది. నైట్ పార్టీకి కియారా.. సిద్దార్థ్ ఇంటికి రావడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే కియారా విజువల్స్ డిలీట్ చేయాలని ఆయన మీడియాతో గొడవ పెట్టుకోవడం న్యూస్ మరింత వైరల్ అయిపోయింది. ఏమని సిద్దార్త్ గొడవ చేశాడో గానీ.. వాళ్ల లవ్ మేటర్ యమా స్పీడ్ గా పాకిపోతోంది.