ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...బ్లాక్ బస్టర్ దర్శకుడు సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న సినిమా "పుష్ప". ఇక ఇటీవల ఈ సినిమాకి కొంచెం గ్యాప్ ఇచ్చి సుకుమార్ తన కూతురి ఫంక్షన్ లోను, బన్నీ దుబాయ్ లోను గడిపారు. ఇక తరువాత ఈ సినిమా యాక్షన్ సీన్స్ కి గ్యాప్ ఇచ్చి సాంగ్స్ తీయాలని డిసైడ్ అయ్యారట పుష్ప టీమ్ వారు. అందుకే, ఇప్పుడు దుబాయ్ లో సాంగ్ ని ప్లాన్ చేయబోతున్నారనే టాక్ అయితే వినిపిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే మాంచి ట్రాక్స్ ని రెడీ చేశాడని, దీంతోనే షూటింగ్ చేయబోతున్నారని సమాచారం అందుతుంది..పాటలను ఒక రేంజ్ లో కంపోజ్ చేస్తున్నాడట దేవి శ్రీ ప్రసాద్..


అయితే, పుష్ప పాటల కోసం ఇప్పుడున్న పరిస్థితుల్లో పుష్ప గెటప్ లోనే అల్లు అర్జున్ సాంగ్స్ షూటింగ్ చేస్తారా.. లేదా స్టైలిష్ గా బన్నీని చూపిస్తారా అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది.ఇక ఈ పాటలు విజువల్స్ కోసం బన్నీ స్టెప్పులు చాలా ముఖ్యం.. ఇక ఆ స్టెప్పులని కంపోజ్ చెయ్యడానికి స్టార్ కోరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కూడా దుబాయ్ వెళ్లాడట....షూటింగ్ కోసం పక్కా లొకేషన్స్ ని వెతుకుతున్నారని, అవి పూర్తయిన అయిన వెంటనే పుష్ప సాంగ్స్ ని ప్లాన్ చేస్తారని సమాచారం అందుతుంది.ప్రస్తుతం అయితే బన్నీ ఫ్యామిలీతో దుబాయ్ లో చక్కర్లు కొడుతున్న విషయం అందరికీ తెలిసిందే.బన్నీ సిస్టర్ క్యారెక్టర్ లో మేఘాఆకాష్ నటిస్తుందని వార్తలు కూడా వినిపించాయి. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన హాట్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో చాలా గ్రాండ్ గా విడుదల చెయ్యాలని పక్కా ప్లాన్ తో ఉన్నారట మైత్రి మూవీ మేకర్స్ వారు. ఇక చూడాలి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో....


మరింత సమాచారం తెలుసుకోండి: