తెలుగులో
దిల్ రాజు కి టాప్ నిర్మాతగా గత పది సంవత్సరాల నుంచి ఉన్నారు.ఆయనకి ఫ్యామిలీ సినిమాలు నిర్మించడంలో చాలా అనుభవం ఉంది. బొమ్మరిల్లు , సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు లాంటి సినిమాలు
దిల్ రాజు కి కలెక్షన్స్ తో పాటు రాష్ట్రం అంత గొప్ప పెరు తెచ్చాయి.
దిల్ రాజు కి కథల సెలక్షన్ లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఆయన తన సినిమాలని ప్రమోట్ చేయడంలో కూడా ముందుంటాడు. నైజాం ఏరియా కి నెంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్ గా
దిల్ రాజు వెలిగిపోతున్నాడు. ఇక
దిల్ రాజు ప్రస్తుతం తను ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న స్టార్
హీరో పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమాని నిర్మిస్తున్నారు .
శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ చేస్తున్న ఈ
సినిమా హిందీ లో విడుదలైన
పింక్ సినిమా రీమేక్. ఈ సినిమాకి ముందు
దిల్ రాజు ఇంకొక
సినిమా విడుదల కాబోతుంది . అదే షాది ముబారక్
సినిమా . ఈ సినిమాలో మొగలి రేకులు సీరియల్ హీరోగా చేసిన
ఆర్ కె నాయుడు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ
సినిమా షూటింగ్ అంత అయిపోయాక
ఆర్ కె నాయుడు ఈ సినిమాని
దిల్ రాజుకి చూపించారట. చూసిన వెంటనే
దిల్ రాజు కి ఈ
సినిమా నచ్చింది. అక్కడక్కడ కొన్ని మార్పులు చేర్పులు చేస్తే తను ఈ సినిమాని కొంటానని అనడంతో ఈ సినిమాలోని కొన్ని సీన్స్ కి మార్పులు చేసి చూపించారు. ఇక వెంటనే
దిల్ రాజు ఈ
సినిమా రైట్స్ తీసుకొని విడుదల చేస్తున్నాడు. ఈ సినిమాని చూసి హాయిగా నవ్వుకోవచ్చు అని
దిల్ రాజు అంటున్నాడు. ఈ
సినిమా మీకు ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అని నా గ్యారెంటీ అని ఆయన అన్నారు.
మార్చి 5 న విడుదల కాబోతున్న ఈ
సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.