మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట సినిమా లో నటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ శెరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా లో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండగా ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ మహేశ్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  సరిలేరు నీకెవ్వరూ సినిమా విజయంతో ఉత్సాహంగా ఉన్న మహేష్సినిమా ను కూడా అదే విధంగా హిట్ చేయాలనీ ప్రయత్నిస్తున్నారు.. సరిలేరు నీకెవ్వరూ సినిమా తో స్టార్ కమర్షియల్ డైరెక్టర్ గా మారాడు అనిల్ రావిపూడి..

టాలీవుడ్ లో వరుసగా నాలుగు సినిమాలు చేసి హిట్ కొట్టిన దర్శకులు చాలా తక్కువ గా ఉన్నారు. అందులో ఒకరు అనిల్ రావిపూడి.  తొలి సినిమా హిట్ కాగానే డైరెక్టర్స్ రెండో సినిమాతోనే తుస్ మనిపిస్తారు. కానీ సినిమా సినిమా కి ఎదుగుతూ ఒదిగి ఉండి మళ్ళీ మళ్ళీ హిట్ కొడుతున్నాడు అనిల్ రావిపూడి..ప్రస్తుతం అయన దర్శకత్వంలో f3 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్నీ  సినిమా పోస్టర్ ని రిలీజ్ చేసి మరీ అధికారికంగా ప్రకటించేశారు. వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన f2 ఎంత పెద్ద హిట్ అయ్యిందంటే ఫామిలీ ప్రేక్షకులకు ఈ సినిమా విపరీతంగా నచ్చేసింది. సరిలేరు నీకెవ్వరూ తో వరుసగా నాలుగు హిట్లు కొట్టారు అనిల్..

సర్కార్ వారి పాట తరవాత దర్శకధీరుడు రాజమౌళితో మహేష్సినిమా చేయబోతున్నాడన్న సంగతి తెలిసిందే.. ఈ  సినిమా కంటే ముందు మహేశ్ బాబు మరో రెండు చిత్రాలను చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం కథలను వింటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వంశీ పైడిపల్లి, వెంకీ కుడుమల అతడికి కథలు చెప్పారు. ఆ చర్చల దశలో ఉండగానే తాజాగా  అనిల్ రావిపూడి.. మహేశ్ బాబుకు అదిరిపోయే కథను వినిపించాడని ఓ న్యూస్  చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ సారి పంథాను మార్చి మరో ప్రయోగం చేద్దామని సదరు దర్శకుడికి తేల్చి చెప్పాడట సూపర్ స్టార్. దీంతో తన దగ్గర ఉన్న మరో స్టోరీని కూడా నేరేట్ చేశాడని అంటున్నారు. అనిల్ చెప్పిన ఈ కథకు మహేశ్ బాబు ఇంప్రెస్ అయ్యాడని తెలుస్తోంది. దీంతో ఈ లైన్‌ను తన కోసం లాక్ చేయమని అతడికి చెప్పాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: