కోలీవుడ్ ప్రేమ జంట విజ్ఞేష్ నయనతార పెళ్లి చేసుకుని ఒకటి కాబోతున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరిలోనే వీరి వివాహం ఉండబోతుందని కోలీవుడ్ మీడియా కోడై కూసింది. కానీ పెళ్లి మాత్రం జరగలేదు. అయితే ఇప్పుడు మార్చ్ లో ఈ జంట ఒకటి కాబోతుందని వార్తలు వాస్తున్నాయి. వీటిపై కూడా విజ్ఞేష్ నయన్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. దాంతో మార్చ్ లో అయినా వీరి పెళ్లి జరుగుతుందా లేదా అన్న సందేహం అటు అభిమానుల్లో..ఇటు తమిళ ప్రేక్షకుల్లో ఉంది. ఇదిలా ఉండగా నయన తార -విజ్ఞేష్ లు 2015 లో తమిళ చిత్రం "నానుమ్ రౌడీ దాన్" షూటింగ్ సందర్భంగా ప్రేమలో పడ్డారు. ఈ సినిమాకు విజ్ఞేష్ దర్శకుడు కాగా ...నయన్ హీరోయిన్ గా నటించి అలరించింది. అప్పటి నుండి ఈ జంట డేటింగ్ చేస్తూ అనేక సార్లు తమ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తుంది. కానీ పెళ్లి పై మాత్రం నోరు మెదపడం లేదు.

వీరి ప్రేమ మొదలై ఇప్పటివరకు 6 ఏళ్ళు అవుతున్నా పెళ్లి చేసుకోకపోవడంతో ఇక ఈ జంట పెళ్లి చేసుకోవడం కూడా కష్టమే అన్న గుస గుసలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. దానికి కారణం గతంలో నయనతార కు ప్రేమ వ్యవహారాలు ఉండటం..అవి పెళ్లి వరకు వచ్చి పెటాకులవడమే..మరి మార్చ్ లో అయినా ఈ జంట ఒకటవుతుందా లేదా చూడాలి. ఈ విషయం పక్కన పెడితే నయనతార సౌత్ కు లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. అప్పట్లో గ్లామర్ పాత్రల్లో అలరించి మెప్పించిన ఈ భామ ఇప్పుడు క్యారెక్టర్ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తూ అలరిస్తోంది. అంతే కాకుండా మెగాస్టార్ లాంటి బడా హీరోల సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటుంది. ఇక  ప్రస్తుతం రజిని ఖాంత్ హీరోగా తెరకెక్కుతున్న దర్బార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: