బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ నెల 27 తేదీన హృతిక్ వాంగ్మూలం తీసుకుంటామని తెలిపారు. గతంలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ చేసిన ఫిర్యాదు తో హృతిక్ రోషన్ కు తాజాగా పోలీసులు సమన్లు జారీ చేశారు. నటి కంగనా రనౌత్ నుండి తనకు బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయంటూ గతంలో 2016లో హృతిక్ రోషన్ పోలీసులను ఆశ్రయించారు. అయితే ఆ మెయిల్ హృతిక్ రోషన్ ఏ తనకు ఇచ్చాడని తాము అదే ఈమెల్ ద్వారా మాట్లాడుకునే వాళ్ళమని కంగనా పోలీసులకు తెలిపింది. అంతే కాకుండా కంగనా కూడా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చింది. దాంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఈ కేసు విచారణలో భాగంగా 2016 లో సైబర్ సెల్ దర్యాప్తు బృందం హృతిక్ రోషన్ ఫోన్ మరియు లాప్ టాప్ ను స్వాధీనం చేసుకుంది. ఇక 2020 లో హృతి రోషన్ తరపు న్యాయవాది  అభ్యర్థన మేరకు ఈ కేసు సిఐయూ కు బదిలీ చేసింది.

ఇదిలా ఉండగా  అప్పట్లో హృతిక్ కంగనా ప్రేమలో ఉన్నారంటూ బాలీవుడ్ లో గుసగుసలు వినిపించాయి. భార్య తో విడాకుల తరవాత హృతిక్ రోషన్ కంగనా కు దగ్గరయ్యారని వార్తలు వచ్చాయి. కానీ ఓ ఇంటర్వ్యూలో కంగనా ఆ వార్తలను కండిచింది. తమ మధ్య ప్రేమ దోమ లాంటివి ఏమి లేవని..ఈ వార్తలు ఎక్కడనుండి వాడుతున్నాయో తనకు తెలుసని ఘాటుగా రీప్లే ఇచ్చింది. ఇక వీరిద్దరూ కలిసి అనేక సినిమాల్లో కలిసి నటించారు. 2010 లో వచ్చి సూపర్ హిట్ అయిన కైట్స్ సినిమాలో నటించి అలరించారు. 2013 లో వచ్చిన క్రిష్-3 సినిమాలోను నటించారు. ఇక ఈ కేసు మళ్ళీ తెరపైకి రావడంతో ఫైర్ బ్రాండ్ కంగనా ఎలా స్పందిస్తుంది అన్న ఆసక్తి మొదలయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: