విభిన్నమైన సినిమాలలో నటిస్తూ తనకంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించుకున్న నటుడు అడివి శేష్ . అయితే అడివి శేష్ చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఆయనకి ఒక సినిమాతో మంచి పేరు వచ్చింది. ఆ సినిమానే 2016 లో వచ్చిన క్షణం. ఈ సినిమాతో అడవి శేష్ పేరు మారుమోగిపోయింది. తెలుగులో చాలా తక్కువ వచ్చిన థ్రిల్లర్స్ లో క్షణం సినిమా బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ సినిమా కథ అడివి శేష్ రాసుకోవడంలోను , అలాగే నటించడంలోను మంచి మార్కులు కొట్టేసాడు. ఇక ఈ సినిమా ఈరోజుతో 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆయన ఈ సినిమాకి ముందు పంజా , కిస్ లాంటి సినిమాల్లో నటించినప్పటికీ వాటిలో పెద్దగా పేరు రాలేదు. కానీ ఈ ఒక్క హిట్ తో శేష్ కి అభిమానులు మొదలయ్యారు. ఈ సినిమాలో అడివి శేష్ కి జోడిగా ఆదా శర్మ నటించింది. క్షణం లో ఆమెది చాలా ముఖ్యమైన పాత్ర. అలాగే డైరెక్టర్ రవికాంత్ పేరేపు కూడా తన దర్శకత్వ ప్రతిభని ఈ సినిమాలో చూపించారు. ఇక అనసూయ కి ఈ సినిమాతో ఒక రేంజ్ క్రేజ్ వచ్చింది. అప్పటిదాకా జబర్దస్త్ కామెడీ షో లో అందంగా కనిపించే తన లో ఇంత మంచి నటి ఉందని ఎవరు ఊహించి ఉండరు. అంతలా ఈ సినిమాలో విలన్ గా చేసింది. ఈ సినిమా ఇప్పటికి చూసిన కూడా ఎక్కడా బొరె కొట్టాదు. అలాగే వెన్నెల కిషోర్ అంటే కమెడియన్ పాత్రలకే పనికొస్తాడు అనుకున్న అందరికి ఈ సినిమాలోని పాత్ర అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయం సాధించింది. కోటి రూపాయలతో నిర్మించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: