ఆరెక్స్ 100 కార్తికేయ హీరోగా కౌశిక్ డైరక్షన్ లో వస్తున్న సినిమా చావు కబురు చల్లగా.. ఈ సినిమాలో కార్తికేయ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా మార్చ్ 19న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా సాంగ్స్ హడావిడి బాగానే చేస్తుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా వస్తున్నారని తెలుస్తుంది.

తన సినిమాలతో పాటుగా ఇతర హీరోల సినిమాలకు అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తుంటారు. ఆరెక్స్ 100 సినిమాతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న కార్తికేయ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చేస్తున్న చావు కబురు చల్లగా సినిమాకు అల్లు అర్జున్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. సినిమాపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫోకస్ పడేలా చూస్తున్నారు. సినిమాలో కార్తికేయ ఊర మాస్ క్యారక్టర్ లో నటిస్తున్నాడు.

సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ రాగా కచ్చితంగా కార్తికేయకు ఈ సినిమా మంచి రిజల్ట్ వచ్చేలా ప్రమోట్ చేస్తున్నారు. ఇక లావణ్య త్రిపాఠి కూడా కెరియర్ లో ఫస్ట్ టైం డీ గ్లామరస్ గా నటించింది. సినిమాలో ఆమె చేసిన పాత్ర చాలా ఇంపార్టెంట్ అని తెల్సుతుంది. ఊర మాస్ హీరో.. డీ గ్లామర్ హీరోయిన్ ఇలా సినిమా మాస్ ఆడియెన్స్ కు చాలా దగ్గరగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. కార్తికేయ మాత్రం ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సినిమాలైతే చేస్తున్నాడు కాని వాటికి మంచి ఫలితాలు రావట్లేదు.  మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.                                        
  

మరింత సమాచారం తెలుసుకోండి: