బాలకృష్ణ హీరోగా
మాస్ సినిమాల స్పెషలిస్ట్
బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక
సినిమా షూటింగ్ వేగవంతంగా జరుగుతోంది. కాగా ప్రస్తుతం ఈ
మూవీ షూటింగ్ గుంటూరు లోని పల్నాడు ప్రాంతంలో జరుగుతున్నట్లు టాక్.
బాలయ్య ఇందులో రెండు రోల్స్ చేస్తుండగా
యువ భామ ప్రగ్య
జైస్వాల్ ఇందులో
హీరోయిన్ గా నటిస్తోంది.
థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై
మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. మంచి యాక్షన్ తో కూడిన
మాస్ ఎంటర్టైనర్ గా దర్శకుడు
బోయపాటి తెరకెక్కిస్తున్న ఈ
మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ గత ఏడాది
బాలయ్య జన్మదినం సందర్భంగా రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ దక్కించుకోవడంతో పాటు మూవీపై అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచింది.
కాగా ఈ
మూవీ మే 28న రిలీజ్ కానున్నట్లు ఇటీవల యూనిట్ అధికారికంగా ప్రకటన రిలీజ్ చేసింది. అయితే దీని తరువాత
యువ సక్సెసఫుల్ డైరెక్టర్
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో
బాలయ్య ఒక
మూవీ చేయనున్నారు.
టాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ మైత్రి
మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం కానున్న ఈ
మూవీ యొక్క స్టోరీ ని ఇటీవల
గోపీచంద్ బాలయ్యకు వినిపంచినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల
రవితేజ తో
క్రాక్ వంటి సూపర్ హిట్
మూవీ తీసి సూపర్ హిట్ కొట్టిన
గోపీచంద్, ఈ మూవీలో
బాలయ్య ని ఒక పవర్ఫుల్
పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించనున్నట్లు చెప్తున్నారు.
పక్కాగా కమర్షియల్ అంశాలతో పాటు కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా
గోపీచంద్ ఈ
మూవీ తీయనున్నారని, తప్పకుండా రిలీజ్ తరువాత ఈ
మూవీ నందమూరి ఫ్యాన్స్ ని కూడా ఎంతో ఆకట్టుకుంటుందని అంటున్నారు. ఒకరకంగా గతంలో
బాలయ్య నటించిన రౌడీ ఇన్స్ పెక్టర్
మూవీ లోని పాత్ర మాదిరిగా ఇందులో ఆయన పాత్ర ఉంటుందని టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే నిజంగా ఇది
బాలయ్య ఫ్యాన్స్ కి సూపర్ న్యూస్ అనే చెప్పాలి.... !!