టాలీవుడ్ సినీ నటుడు నాగ శౌర్య. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న నాగ శౌర్య.. స్టార్ హీరోల రేంజ్ లో ఫాలోయింగ్ పెంచుకుంటున్నాడు. తెలుగు సినిమాలల్లో నటించిన నాగ శౌర్య మోడలింగ్ రంగంలో కూడా పని చేశాడు. నాగశౌర్య మొదట కొన్ని కీలక పాత్రలో నటించాడు. ఇక తనదైన శైలిలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

2011లో ' క్రికెట్, గర్ల్స్ అండ్ బీర్' అనే సినిమా ద్వారా తొలిసారిగా సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత చందమామ కథలు సినిమాలో అతిథి పాత్రలో నటించగా.. ఇక ఊహలు గుసగుసలాడే సినిమా నుంచి హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుస సినిమాలలో నటించిన నాగ శౌర్య 2018లో దియా అనే తమిళ సినిమాలో నటించాడు. గత ఏడాది అశ్వత్థామ సినిమా లో నటించగా అంతగా విజయాన్ని అందుకోలేకున్నా మొత్తానికి ఆయన నటన మంచి గుర్తింపును తీసుకొచ్చింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఓ సినిమా , శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ లో ఓ సినిమా లలో  బిజీగా ఉన్నారు. అంతేకాకుండా అనీష్ కృష్ణ దర్శకత్వంలో  వస్తున్న ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్ లో నాలుగో సినిమా గా తెరకెక్కనుండగా.. ఈ సినిమా గురించి టైటిల్ ఇప్పటివరకు నిర్ణయించకపోగా తాజాగా ఓ టైటిల్ ను ఫిక్స్ చేశారు.

అనీష్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు మొత్తానికి 'శ్రీకృష్ణ సత్య భామ' అనే పేరును నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ టైటిల్ లుక్ ను విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే నాగశౌర్య మరో రెండు సినిమాల్లో నటిస్తుండగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో 'వరుడు కావలెను', సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో 'లక్ష్య' అనే సినిమాలో నటిస్తున్నాడు. మొత్తానికి నాగశౌర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: