మలయాళం బ్యూటి హిరోయిన్ అను ఇమ్మాన్యుయేల్‌ అమెరికాలో పుట్టి పెరిగి 2011లో మలయాళీ చిత్రం 'స్వప్న సంచారి'తో వెండితెరకు పరిచయం అయింది. తరువాత వచ్చిన మలయాళ సినిమా "యాక్షన్‌ హీరో బైజు" అనే మూవీలో హీరోయిన్‌గా అడుగు పెట్టిందీ హీరోయిన్ అను ఇమ్యాన్యుయేల్ ఈ సినిమాలో నటన పరంగా మంచి గుర్తింపే లభించినప్పటికీ ఎక్కువ అవకాశాలు వచ్చింది మాత్రం తెలుగు ఇండస్ట్రీలో నే. టాలీవుడ్‌లో తొలి చిత్రం 'మజ్ను'లో నాని సరసన నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో వరస సినిమా లతో దూసుకు పోయినప్పటికీ అదృష్టం కలిసిరాక స్టార్ హీరోయిన్ హోదా అందుకోలేకపోయింది.

అను ఇమ్మాన్యుయేల్‌ తన అమాయక చూపులు, అందంతో తెలుగు సినీ ప్రేక్షకులని ఆకట్టుకొని  టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి  అగ్ర హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ క్వీన్ కు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఈ హీరోయిన్ తెలుగు లో ఇప్పటి వరకు "కిట్టు ఉన్నాడు జాగ్రత్త", "ఆక్సిజన్' , "అజ్ఞాతవాసి", "నా పేరు సూర్య', "గీత గోవిందం", "అల్లుడు అదుర్స్" వంటి చిత్రాలలో నటించింది. గీతా గోవింద మూవీ లో అతిథి పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్పటికీ ఇప్పటివరకు పెద్ద సక్సెస్‌ని మాత్రం కోలేకపోతుంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ డైరెక్టర్‌తో ప్రేమాయణంలో ఉందన్న వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.గత కొన్నేళ్లుగా ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం కుమారుడు జ్యోతి కృష్ణతో డేటింగ్‌లో ఉంది.స్నేహం కాస్తా రిలేషన్ షిప్‌గా మారిందనేది కోలీవుడ్ వర్గాల కథనం.మరి ఈ వార్తలపై ఇటు అను కానీ అటు దర్శకుడు జ్యోతి కృష్ణ కానీ స్పందింలేదు.

ఇటీవల సంక్రాంతి బరిలో దిగిన బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన ‘అల్లుడు అదుర్స్‌’ చిత్రంతో గ్లామర్ పాత్రల్లో ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. తాజాగా ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో శర్వానంద్‌, సిద్ధార్థ్‌లు హీరోలుగా తెరకెక్కిస్తోన్న మల్టీస్టారర్ మూవీ ‘మహా సముద్రం’లో అను ఇమ్మాన్యుల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాపై అను చాలా ఆశలే పెట్టుకుంది. చూడాలి మరి ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు అనిపిస్తుందో ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: