అను ఇమ్మాన్యుయేల్ తన అమాయక చూపులు, అందంతో తెలుగు సినీ ప్రేక్షకులని ఆకట్టుకొని టాలీవుడ్లో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ క్వీన్ కు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఈ హీరోయిన్ తెలుగు లో ఇప్పటి వరకు "కిట్టు ఉన్నాడు జాగ్రత్త", "ఆక్సిజన్' , "అజ్ఞాతవాసి", "నా పేరు సూర్య', "గీత గోవిందం", "అల్లుడు అదుర్స్" వంటి చిత్రాలలో నటించింది. గీతా గోవింద మూవీ లో అతిథి పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్పటికీ ఇప్పటివరకు పెద్ద సక్సెస్ని మాత్రం కోలేకపోతుంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ డైరెక్టర్తో ప్రేమాయణంలో ఉందన్న వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.గత కొన్నేళ్లుగా ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం కుమారుడు జ్యోతి కృష్ణతో డేటింగ్లో ఉంది.స్నేహం కాస్తా రిలేషన్ షిప్గా మారిందనేది కోలీవుడ్ వర్గాల కథనం.మరి ఈ వార్తలపై ఇటు అను కానీ అటు దర్శకుడు జ్యోతి కృష్ణ కానీ స్పందింలేదు.
ఇటీవల సంక్రాంతి బరిలో దిగిన బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన ‘అల్లుడు అదుర్స్’ చిత్రంతో గ్లామర్ పాత్రల్లో ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. తాజాగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ్లు హీరోలుగా తెరకెక్కిస్తోన్న మల్టీస్టారర్ మూవీ ‘మహా సముద్రం’లో అను ఇమ్మాన్యుల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాపై అను చాలా ఆశలే పెట్టుకుంది. చూడాలి మరి ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు అనిపిస్తుందో ఈ ముద్దుగుమ్మ.