ఇంటర్నెట్ డెస్క్: జబర్దస్త్ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రష్మీ గౌతం తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగమైన పోస్ట్ చేసింది. కుక్కలకు కూడా ఫీలింగ్స్ ఉంటాయని, వాటిని హింసించ వద్దని, వాటిని చేతనైనంత సాయం చేయమని ఆ పోస్టులో రాసుకొచ్చింది. ఒక వీడియోలో వీధి కుక్క గిన్నెలో ఉన్న ఆహారం నోటితో తీసుకొని తన పిల్లలకు పెడుతున్న వీడియోను ఒక నెటిజన్ పోస్ట్ చేయగా ఆ పోస్ట్ గురించి రష్మీ స్పందిస్తూ మనుషులకే కాదు జంతువులకు కూడా ఫీలింగ్స్ ఉంటాయని, వాటికి చేతనైతే కొంచెం ఆహారం పెట్టాలని కోరింది.
     
రష్మికి కుక్కలంటే చాలా ఇష్టం అనే సంగతి అందరికీ తెలిసిందే. జంతువులను ఎంతో ప్రేమించే రష్మీ జీవహింస చేయరాదని పలు సందర్భాల్లో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. ఎల్లప్పుడూ మూగజీవాలపై ప్రేమను కురిపించే రష్మీ వాటిని రక్షించాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటుంది. మూగజీవాలను ఎవరైనా హింసించిన విషయాలపై కూడా ఆమె వ్యతిరేకించారు. వాటిపై బాధ పడటంతో పాటు మూగజీవాలను హింసించవద్దని కోరుతుంటుంది.
       
మరోవైపు బుల్లితెరపై ఎక్స్ట్రా జబర్దస్త్ షోతో బిజీగా ఉన్న రష్మీ గౌతమ్ ఈ మధ్య కాలంలో ఇతర ఛానెళ్లలో ప్రసారమవుతున్న ఈవెంట్లలో కూడా పాల్గొనడంతో పాటు సందడి చేస్తున్నారు. సుధీర్ రష్మీ జోడీకి సైతం ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ వచ్చింది. హీరోయిన్‌గా కూడా రష్మి అనేక సినిమాల్లో నటించింది. గుంటూరు టాకీస్ సినిమాతో రష్మి టాలీవుడ్‌లో ఓ రేంజ్  క్రేజ్ సంపాదించింది. ఆ సినిమాలో ఆమె ఎక్స్‌పోజింగ్‌, లిప్ కిస్‌ సీన్లతో కుర్రకారు మతిపోయింది. అంత హాట్‌గా నటించినా‌ రష్మి పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. తాజాగా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాలో నందుతో కలిసి రష్మీ నటించింది. ప్రస్తుతం రష్మీ ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: