మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని, దేవాలయ భూముల మోసాలు, కుంభకోణాలు నేపథ్యంలో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే విధంగా దర్శకుడు
కొరటాల తీస్తున్నట్లు టాక్. కాగా ఈ
మూవీ లో
మెగాస్టార్ చిరంజీవి ఒక మాజీ నక్సలైట్ పాత్ర చేస్తుండగా చరణ్, సిద్ద అనే విద్యార్థి నాయకుడి పాత్ర చేస్తున్నట్లు టాక్. కాగా ఈ
మూవీ ఈ ఏడాది మే 13న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇక దీని తరువాత తన తదుపరి సినిమాని
మోహన్ రాజా దర్శకత్వంలో చేయనున్నారు మెగాస్టార్. ఇప్పటికే ఈ
మూవీ యొక్క అధికారిక
పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇటీవల మలయాళంలో
మమ్ముట్టి హీరోగా తెరకెక్కి సూపర్ హిట్ కొట్టిన లూసిఫర్ మూవీకి అఫీషియల్ రిమేక్ గా ఈ
మూవీ తెరకెక్కనుంది.
అయితే దీని తరువాత
బాబీ తో ఒక
సినిమా అలానే
మెహర్ రమేష్ తో మరొక
సినిమా చేయనున్నారు మెగాస్టార్. అంతేకాక ఆచార్య దర్శకుడు
కొరటాల శివ తో కలిసి మొత్తం తాను చేస్తున్న నలుగురు దర్శకుల తో ఇటీవల దిగిన ఒక ఫోటోని తన సోషల్
మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు మెగాస్టార్. అయితే అసలు మ్యాటర్ ఏమిటంటే లూసిఫర్
రీమేక్ తరువాత రమేష్ తో చేయాలా, లేక
బాబీ తో చేయాలా అనే విషయమై
మెగాస్టార్ కొంత సందిగ్ధంలో ఉన్నారని, నిజానికి ఇప్పటికే ఈ ఇద్దరు దర్శకులు కూడా ఆయన కు కథలు వినిపించి వాటి యొక్క పూర్తి స్క్రిప్ట్ ని ఆల్మోస్ట్ సిద్ధం చేసే పనిలో నిమగ్నం అయి ఉన్నట్లు టాక్. మరి లూసిఫర్ తరువాత తదుపరి
సినిమా ఛాన్స్ ని
మెగాస్టార్ ఈ ఇద్దరిలో ఎవరికి ఇస్తారు అనేది పక్కాగా తెలియాలి అంటే మరికొన్నాళ్లు వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.....!!