టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో పదకొండేళ్ల క్రితం తెరకెక్కి సూపర్ హిట్ కొట్టిన సినిమా అదుర్స్. ఎన్టీఆర్ ఈ మూవీలో డ్యూయల్ రోల్ చేయగా నయనతార, షీలా హీరోయిన్స్ గా నటించారు. కొడాలి నాని సమర్పణ లో వైష్ణవి ఆర్ట్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడిన ఈ మూవీలో ఎన్టీఆర్ నరసింహ అనే పాత్ర తో పాటు చారి అనే పాత్రలో తన అద్భుత నటనతో ఆడియన్స్ నుండి మంచి పేరు దక్కించుకున్నారు. మంచి యాక్షన్, ఎమోషనల్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ శ్రోతలను విశ్లేషంగా ఆకట్టుకున్నాయి.

రిలీజ్ అనంతరం సూపర్ హిట్ కొట్టిన ఈ సినిమాకి సీక్వెల్ గా అదుర్స్ 2 తెరకెక్కనుంది అంటూ కొన్నాళ్లుగా పలు మీడియా మాధ్యమాల్లో పలు కథనాలు ప్రచారం అవుతున్నాయి. ఇక మరోవైపు అటు ఎన్టీఆర్, ఇటు వినాయక్ తమ తమ కమిట్మెంట్స్ తో ముందుకు సాగుతూ ఉండడంతో అసలు ఈ సినిమా ఉంటుందా లేదా అనే సందిగ్ధం అందరిలోనూ మరింతగా పెరిగింది. కాగా నిజానికి ఈ సినిమాకి సీక్వెల్ అయితే తీసే ఆలోచన తనకు ఉన్నప్పటికీ పక్కాగా ఎప్పుడు తీస్తాను అనే క్లారిటీ మాత్రం లేదని, దానికి మరికొంత సమయం ఉందని ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా దర్శకుడు వినాయక్ చెప్పినట్లు టాక్. 

ఇక ఎన్టీఆర్ కూడా ఈ మూవీ సీక్వెల్ పై బాగానే ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్సకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్న ఎన్టీఆర్, ఆ తరువాత త్రివిక్రమ్ తో అలానే కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కూడా సినిమాలు ఇప్పటికే కమిట్ అయి ఉండడంతో వాటి తరువాత అదుర్స్ 2 ని ఆయన చేసే ఛాన్స్ లేకపోలేదని అంటున్నారు. ఇక మొదటి నుండి వినాయక్ తో ఎన్టీఆర్ కి మంచి అనుబంధం ఉండడంతో ఇప్పటికిప్పుడు కాకపోయినా తప్పకుండా వీరిద్దరి కలయికలో ఆ మూవీ రాబోయే రోజుల్లో వస్తుందని అటు ఎన్టీఆర్ సన్నిహితులు కూడా హింట్ ఇచ్చినట్లు సమాచారం. మొత్తంగా అదుర్స్ 2 అయితే తెరకెక్కే ఛాన్స్ ఉందని, అయితే దానిపై పూర్తి క్లారిటీ రావాలంటే దానికి కాలమే సమాధానం చెప్పాలని విశ్లేషకులు అంటున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: