ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘రాథే శ్యామ్’ మూవీ పాటల గురించి ఒక రూమర్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తోంది. ఈ మూవీకి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ తో పాటు మరో ఇద్దరు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లు ఈమూవీకి పనిచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


గతంలో ‘సాహో’ మూవీ విషయంలో కూడ ముగ్గురు సంగీత దర్శకులు పనిచేసారు. వారంతా బాలీవుడ్ సంగీత దర్శకులు కావడంతో ‘సాహో’ మూవీలోని పాటలు తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చలేదు. ఇప్పుడు మళ్ళీ ‘రాథే శ్యామ్’ కు బాలీవుడ్ సంగీత దర్శకులు పనిచేస్తూ ఉండటం ప్రభాస్ అభిమానులను కలవర పెడుతోంది. ‘రాథే శ్యామ్’ మూవీ ఒక ప్రేమ కథ. ఇలాంటి ప్రేమ కథ సినిమాలకు పాటల ట్యూనింగ్ చాల ముఖ్యం. ఇలాంటి సినిమాలలో పాటలు హిట్ అవ్వకపోతే సినిమా ఎంత బాగున్నప్పటికీ ప్రేక్షకులు కనెక్ట్ కాలేరు.


దీనితో ‘సాహో’ లో జరిగిన పొరపాటు మళ్ళీ ‘రాథే శ్యామ్’ విషయంలో రిపీట్ కాబోతోందా అంటూ ప్రభాస్ అభిమానులు భయపడిపోతున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీలోని పాటలను ఒకొక్కటిగా ఏప్రియల్ నుండి విడుదల చేసి ఈమూవీ పై హైక్ పెంచాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పాటల ట్యూనింగ్ సరిగ్గా కుదరలేదు పాటల ట్యూన్స్ అన్నీ ఉత్తరాది ప్రాంతానికి చెందిన హిందుస్థాని సాంప్రదాయంలో కంపోజ్ చేసినట్లు టాక్.


 అయితే ఇలాంటి ట్యూన్స్ దక్షిణాది ప్రేక్షకులకు ముఖ్యంగా తెలుగువారికి నచ్చదు. అయితే ఇప్పటికే విడుదల అయిన ఈమూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ జనానికి బాగా నచ్చడంతో ‘సాహో’ అనుభవాలతో ఈ మూవీ మ్యూజిక్ విషయంలో ఇప్పటికే జాగ్రత్తలు తీసుకుని ఉంటారు అన్న అభిప్రాయంలో ప్రభాస్ అభిమానులు ఉన్నారు. ఇది ఇలా ఉండగా ఈ ఆమధ్యన విడుదలైన ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ లో ప్రభాస్ లుక్ ఏమాత్రం బాగా లేదని బాలీవుడ్ మీడియా కామెంట్స్ చేస్తూ ఉండటంతో ఈ మూవీ పరిస్థితి ఏమిటి అంటూ అభిమానులు కలవర పడుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: