సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు హీరోయిన్లు కలిసి ఎన్నో సినిమాల్లో నటిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ కొంతమంది మాత్రమే తెలుగు ప్రేక్షకులకు  బాగా కనెక్ట్ అయి పోతూ ఉంటారు..  అలా తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన హీరో హీరోయిన్ జోడి ఏది అంటే అందరూ టక్కున చెప్పే విజయ్ దేవరకొండ రష్మిక మందన జోడి. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. దీంతో  అటు తెలుగు ప్రేక్షకులు అందరికీ కూడా ఈ జోడి ఎంతగానో కనెక్ట్ అయింది గీత గోవిందం సినిమా తో జతకట్టిన ఈ జోడి..  ఇక ఆ తర్వాత డియర్ కామ్రేడ్ అనే  సినిమాతో కూడా తెలుగు ప్రేక్షకులను అలరించింది అన్న విషయం తెలిసిందే.



 అయితే ఇక ఈ రెండు సినిమాల్లో కూడా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా ఉండటం రొమాంటిక్ సన్నివేశాలలో కూడా లీనమై నటించడంతో ఇక వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తుందని..  పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ గతంలో ఎన్నో రకాల వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి అన్న విషయం తెలిసిందే. అయితే డియర్ కామ్రేడ్ సినిమా తర్వాత వీరిద్దరూ ఇక్కడ కలిసి కనిపించడం లేదు అటు రష్మిక మందన్నా ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంటే విజయ్ దేవరకొండ కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.  ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి మళ్ళీ ఎప్పుడు నటిస్తారా అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు




  మరి కొన్ని రోజుల్లో అభిమానుల కోరిక తీరబోతుంది అని అర్థమవుతుంది.  ప్రస్తుతం ఫుల్ జోష్ లో  ఉన్న విజయ్ దేవరకొండ మరికొన్ని రోజుల్లో రష్మిక మందన తో కలిసి నటించబోతున్నాడని సమాచారం ప్రస్తుతం పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో నటిస్తున్న విజయ్ దేవరకొండ ఇక ఈ సినిమా పూర్తవ్వగానే.. తన క్యూట్ జోడి అయిన రష్మిక మందన తో కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నాడట. ప్రస్తుతం రష్మిక మందన్న పుష్పా మిషన్ మజ్ను అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా పూర్తవగానే విజయ్ దేవరకొండ తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: