బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా మూవీగా లైగర్ తెరకెక్కుతోంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఈ హీరో తన నెక్స్ట్ సినిమా గురించి సినీ వర్గాలో ఓ క్రేజీ వార్త తెగ వైరల్ అవుతోంది. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో విజయ్ సరసన నటించిన కన్నడ బ్యూటీ రష్మిక మందాన ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండతో జతకట్టనుందన్న వార్తలు ఫిలిం సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతోంది. ఛలో సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది అనతి కాలంలోనే అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకుని వరుస సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ టాలీవుడ్ ఇస్ట్రీలో తన సత్తాను చాటుకుంటోంది.
ప్రస్తుతం ఈ చిన్నది అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పుష్ప మూవీ తర్వాత సుక్కు విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయబోతున్నాడన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సుక్కు ఈ సినిమాకు సంబంధించి ఒక లైన్ కూడా వినిపించడంతో విజయ్ కూడా ఆ మూవీకి ఓకే చెప్పాడట. దాంతో సుకుమార్ ఈ స్క్రిప్టును కంప్లీట్ చేసే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. ఇకపోతే ఈ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన కన్నడ భామ రష్మిక మందానకు అవకాశం వచ్చే విధంగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప సినిమాలో ఈ చిన్నదాని నటన చూసిన సుక్కు ఈ బ్యూటీకే తన తర్వాతి సినిమాలో ఛాన్స్ ఇవ్వబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి