అభిమానులు తమకిష్టమైన హీరోలకు సంబంధించిన విషయాలను అందరికంటే ముందుగానే తెలుసుకొని సామాజిక మాధ్యమాల్లో అప్ డేట్ చేస్తున్నారు. గతంలో ఫ్యాన్స్ తమ ఫేవరెట్  హీరోలు కొనుగోలు చేసిన కార్ల గురించి ఎక్కువగా మాట్లాడుకునే వారు. కానీ ఇప్పుడు కళ్ళద్దాల దగ్గర నుంచి కాళ్లకు ధరించే ఫుట్వేర్ వరకు అన్ని విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే కొందరు అభిమానులు తమ హీరోలు వాడుతున్న బ్రాండెడ్ వస్తువులను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. కొద్ది వారాల క్రితం రామ్ చరణ్ ధరించిన సన్ గ్లాస్సెస్ ధర 40 వేల రూపాయలు అని.. ఆ కళ్ళద్దాలు ఫలానా బ్రాండ్ అని అభిమానులు ఓ అప్ డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా ఇలాంటి అప్ డేటే ఒకటి తెరమీదకి వచ్చింది.

బుధవారం రోజు డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి వోణిల కార్యక్రమం జరిగింది. అయితే ఈ శుభ కార్యానికి టాలీవుడ్ స్టార్లందరు విచ్చేశారు. కాగా, జూనియర్ ఎన్టీఆర్, ఆయన సతీమణి ప్రణతి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. అయితే ఎన్టీఆర్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఆ క్రమంలోనే ఆయన ధరించిన మాస్క్ గురించి అభిమానులు చర్చించడం ప్రారంభించారు. అయితే తారక్ ధరించిన మాస్క్ యు.ఎ స్పోర్ట్స్ బ్రాండ్ కి చెందినదని.. దాని విలువ అక్షరాలా 2, 340 రూపాయలని అభిమానులు కనిపెట్టేశారు. దీనితో నెటిజన్లు షాక్ అవుతున్నారు.

సాధారణంగా మనం ధరించే మాస్క్ ఖరీదు మహా అంటే 200-300 రూపాయలు ఉంటుంది. కానీ యు.ఎ స్పోర్ట్స్ మాస్క్ చాలా ఎక్కువ ఖరీదు ఉంది. అయితే తమ ఫేవరెట్ హీరో ధరించిన మాస్క్ లాంటిదే కొనుగోలు చేయడానికి కొందరు అభిమానులు ఆన్లైన్లో బుక్ కూడా చేసుకుంటున్నారు. దీంతో ఆ బ్రాండ్ కి తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. తారక్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా అక్టోబర్ 13 వ తేదీన రిలీజ్ కానుంది. రాజమౌళి సినిమా ప్రమోషన్స్ అయిపోగానే తారక్ త్రివిక్రమ్ తో కలిసి తదుపరి సినిమాని ప్రారంభిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: