అక్కినేని నాగార్జున ప్రియ పుత్రుడు అక్కినేని అఖిల్ పూజా హెగ్డే తో కలసి "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పాటలు యూట్యూబ్ వేదికగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఈ సినిమాలో రొమాంటిక్ బాయ్ గా అఖిల్, చిరుబురులాడే అమ్మాయి గా పూజా హెగ్డే నటిస్తున్నారని టీజర్ చూస్తే స్పష్టమవుతోంది. ఆల్రెడీ మ్యూజికల్ హిట్ అయింది కాబట్టి ఇక ఈ సినిమా మినిమమ్ గ్యారెంటీ అని చెప్పుకోవచ్చు.


అయితే ఈ మూవీ హిట్ కావాలని అఖిల్ బాగా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయనకు ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా రాలేదు. కనీసం ఈసారైనా ఒక హిట్ సాధించి హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని అఖిల్ తపన పడుతున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 19న విడుదల కానున్నది. అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా విజయవంతంగా నడుస్తుందా లేక అట్టర్ ఫ్లాప్ అవుతుందా అనే విషయం తెలుసుకోవాలని అల్లు అర్జున్ వేచి చూస్తున్నారట.


ఎందుకు అని అడిగితే నిర్మాత అల్లు అరవింద్ కి బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలంటే చాలా ఇష్టం. బొమ్మరిల్లు, పరుగు వంటి అద్భుతమైన లవ్ స్టోరీలను తెరకెక్కించి గొప్ప డైరెక్టర్ గా పేరు పొందారు. అయితే అతనితో తన కుమారుడు అల్లు అర్జున్ సినిమా చేయించాలని అల్లుఅరవింద్ భావిస్తున్నారు. కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా హిట్ అయితేనే భాస్కర్ ఫామ్ లో ఉన్నారు అనే విషయం తెలుస్తుంది. ఒకవేళ ఆ సినిమా కొత్తగా లేకపోయినా.. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా.. అల్లు అరవింద్ తన ఆలోచనను విరమించుకుంటారు. అల్లు అర్జున్ కి బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉందట. ఆయన కూడా తన తండ్రి లాగానే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రిజల్ట్స్ కోసం వేచి చూస్తున్నారు. మరి అఖిల్ కి తెచ్చే అల్లు అర్జున్ తో పనిచేసే సువర్ణావకాశాన్ని బొమ్మరిల్లు భాస్కర్ దక్కించుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: