ప్రభాస్,  పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ 'రాధేశ్యామ్‌'. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.ఈ సినిమాలో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్‌ పాత్రలో కనిపించనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో జూలై 30న ఈ సినిమా రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం..ఇదిలా ఉంటె రాధేశ్యామ్' తర్వాత ప్రభాస్ అంగీకరించిన సినిమాలన్నింటికీ దాదాపు రూ. 100 కోట్ల రేంజ్‌లోనే పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్‌ 'బాహుబలి' సినిమా తరువాత పాన్ ఇండియన్ స్టార్ గా మారాడు. 'రాధేశ్యామ్' కనుక దేశవ్యాప్తంగా విజయవంతమైతే ప్రభాస్ పారితోషికం మరింత పెరగవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దక్షిణాది నుంచి ఈ రేంజ్ పారితోషికం అందుకుంటున్న నటుడిగా నిలిచాడట. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో రాధే శ్యామ్ జులై 30న విడుదల కానుంది.

 కాగా ఇదివరకు బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు మాత్రమే ఒక్కో సినిమాకు వంద కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే బడా హీరోలు.ఈ జాబితాలోకి తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేరాడట. ఇక ప్రస్తుతం రాధే శ్యామ్ షూటింగ్ ముగించుకున్న ప్రభాస్.. ఇటీవలే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న 'సలార్' సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు..హ్హోంబలే ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని తప్పకుండా ఫాలో అవ్వండి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: