అయితే ఈ సినిమా మర్చి 26న విడుదల కానుంది. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. పి.డి.వి.ప్రసాద్ ఈ సినిమాను సమర్పిస్తున్నాడు. ఈ మధ్యే విడుదలైన రంగ్ దే మొదటి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనికి కోటికి పైగా వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు రెండో పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్. బస్టాండే బస్టాండే అంటూ సాగే ఈ పాటను దేవి శ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ పాడాడు. ఈ పాటకు ఎనర్జిటిక్ ట్యూన్ ఇచ్చాడు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్.
ఈ పాటకు నితిన్, కీర్తి సురేష్పై వచ్చే ఈ టీజింగ్ సాంగ్ అదిరిపోయే కొరియోగ్రఫీ చేశాడు శేఖర్ మాస్టర్. ఇందులో నితిన్ డాన్సులతో పాటు ఇల్లు తుడవడం.. అంట్లు తోమడం లాంటివి కూడా చేసి నవ్వించాడు. రంగ్ దే చిత్రం మార్చి 26న విడుదల అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కూడా పెంచేసారు దర్శక నిర్మాతలు. మిస్టర్ మజ్ను ఫ్లాప్ తర్వాత వెంకీ అట్లూరి చేస్తున్న సినిమా ఇది. మరోవైపు నితిన్ నటించిన చెక్ సినిమాకు ఊహించిన రెస్పాన్స్ రాకపోవడంతో ఈయనకు కూడా రంగ్ దే విజయం కీలకంగా మారింది. ఈ సినిమాకు పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తుండటం విశేషం.