హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచేసిన సెక్సీ బ్యూటీ ఆదా శర్మ ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్, సేల్ క్షణం వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అయితే ఆమె అడవి శేషు తో కలిసి నటించిన క్షణం సినిమా తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. 2016 లో విడుదలైన ఈ సినిమా ఇటివలే 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆదా శర్మ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసి.. "క్షణం సినిమా వచ్చి నేటికి ఐదు సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాను. అది ఏంటంటే తెలుగులో నేను ఐదు సినిమాలకి సైన్ చేశాను. నేను ఏ భాషలో ప్రయోగాత్మక సినిమాలు చేసినా అందరూ నన్ను ఎల్లప్పుడూ సపోర్ట్ చేశారు. మీ ప్రేమాభిమానాలు నాపై కురిపించారు. ఇప్పుడు నేను చేస్తున్న అన్ని సినిమాలు కూడా గతంలో ఎవరూ వచ్చాయని సబ్జెక్ట్స్" అని ఆమె తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.



2019 వ సంవత్సరంలో కల్కి సినిమాలో రాజశేఖర్ సరసన ఆదా శర్మ నటించారు. కానీ ఆమె నటనకు ఎటువంటి గుర్తింపు దక్కలేదు. ఇకపోతే ఆదాశర్మ తల్లిదండ్రులు తమిళనాడుకు చెందిన వారు. మర్చంట్ నేవిలో ఆదా శర్మ తండ్రి కెప్టెన్ గా పనిచేసేవారు. ఆమె తల్లి క్లాసికల్ డాన్సర్. చిన్నతనం నుంచే ఆదాశర్మ హీరోయిన్ కావాలనుకునేవారు. పాఠశాల విద్యను ఆపివేయాలి అనుకున్నారు కానీ తల్లిదండ్రుల ఒత్తిడితో ఆమె 12 తరగతి వరకు చదువుకొని ఆ తర్వాత సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. కానీ ఆమె చిన్న పిల్లలాగా ఉందని సినిమా ఏ దర్శక నిర్మాతలు ఆఫర్లు ఇవ్వలేదు.


అయితే చివరికి 2009వ సంవత్సరంలో 1920 అనే ఒక హారర్ ఫిలిం లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దొరికింది. దీంతో ఆ సినిమాలో అద్భుతమైన నటనా ప్రదర్శన కనబరిచి మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత మళ్ళి ఒక హారర్ సినిమాలో నటించి మెప్పించారు. ఆ విధంగా సినిమాలో చేస్తున్న ఆమెకు 2014 లో పూరీ జగన్నాథ్ హార్ట్ ఎటాక్ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో ఆదా శర్మ నటనకు బాగానే మార్కులు పడ్డాయి. 2020 లో, పతి పత్ని ఔర్ పంగ అనే MX PLAYER వెబ్‌సెరీస్‌లో ఆమె ట్రాన్స్ జెండర్ వుమన్ పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు సైతం పొందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: