మెగామేనల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా న‌టించిన ఉప్పెన మూవీ ఎంత పెద్ద స‌క్సెస్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌సరం లేదు. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఈ సినిమా కు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. హీరో హీరోయిన్ లకు ఇది డెబ్యూ మూవీ అయినా అవ్వక్కయ్యే నటన కనబరిచి సినిమా విజయం లో పాలు పంచుకున్నారు. ఇక ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతు పతి కీలక పాత్రలో నటించారు. హీరోయిన్ కు తండ్రిగా నటించిన విజయ్ సేతుపతి నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. విజయ్ సేతుపతి నటించిన సినిమాలు ఇదివరకు తెలుగులో విడుదలైనా ఈ సినిమా మాత్రం సేతుపతి ఇమేజ్ ను రెట్టింపు చేసింది. ఇక మొదటి సినిమా తోనే వైష్ణవ్ తేజ్ పలు రికార్డులను కూడా సొంతం చేసుకోవడం విశేషం. ఇదిలా ఉండగా ఉప్పెన విజయంతో చిత్ర యూనిట్ మొత్తం ఫుల్ కు ఖుషీగా ఉంది.

అంతే కాకుండా సినిమాలో నటించిన వాళ్లకు..దర్శకుడికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉప్పెన టీమ్ అంతా కలిసి శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు. హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి, నిర్మాత నవీన్, దర్శకుడు బుచ్చిబాబు కలిసి తిరుమల వెళ్లారు. అంతే కాకుండా వైష్ణవ్, కృతి శెట్టి సినిమాలో అయితే ఆశీ..బేబమ్మ లు కలిసి కాలినడకన కొండెక్కారు. వాళ్ళు కొండెక్కుతుండగా తీసిన వీడియోలు మరియు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దర్శనం అనంతరం డైరెక్టర్ బుచ్చిబాబు మీడియాతో మాట్లాడారు. ఉప్పెన స్క్రిప్ట్ ను స్వామి వారి పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు పొందానని మంచి విజయం సాధించిందని అన్నారు. తరవాత సినిమా స్క్రిప్ట్ ను కూడా స్వామి వారి పాదాల వద్ద ఉంచామని త్వరలోనే వివరాలు వెల్లడిస్తా అంటూ బుచ్చి బాబు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: