డీ సినిమాతో హీరో మంచు విష్ణు కమర్షియల్ హిట్ ని అందుకుని మల్టీ చాలెంజ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో మంచు విష్ణు నటించిన సినిమాలన్నీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాయి. ‘దేనికైనా రెడీ’ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు మంచు విష్ణు. ప్రస్తుతం ఈయన మోసగాళ్లు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మోసగాళ్లు అనే టైటిల్ ఎందుకు పెట్టారో సినిమా చూసాక తెలుస్తుందని డైరెక్టర్ చెబుతున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

విష్ణు తన కెరియర్ లోనే భారీ బడ్జెట్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ  సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని పట్టుదలగా ఉన్నారు. ఏవీఏ ఎంటర్టైన్మెంట్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు విష్ణు ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తుండటం విశేషం. ఈ సినిమా ప్రపంచంలో జరిగిన అతిపెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో మంచు విష్ణుకి  చెల్లెలుగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు.అయితే ఈ పాత్రకు మొదట ప్రీతిజింతాను అనుకున్నారట. కానీ ఈ సినిమా కథ విన్న ఆమె.. నేను చేయలేనని చెప్పిందట.

ఈ చిత్రకథ అమెరికాకు సంబంధించిన మనీ స్కామ్ కావడంతో ప్రీతి నిరాకరించింది. నా ఫ్యామిలీ మొత్తం యూఎస్ లో ఉంటోంది. ఇలాంటి సినిమా చేస్తే నన్ను కొడతారు.’’  అని సరదాగా  చెప్పి నో అన్నారట. దాంతో ఆ ఛాన్స్ కాస్త చందమామ కాజల్ ను వరించింది. ఈ సినిమా పై ప్రేక్షకులు కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. దాదాపు 50 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం తనకి అదే స్థాయిలో సక్సెస్ ను కూడా అందిస్తుందని నమ్మకం పెట్టుకున్నాడు మంచు విష్ణువర్ధన్ .

మరింత సమాచారం తెలుసుకోండి: