తెలుగు సినిమా పరిశ్రమకి ఇటీవల రిలీజై సూపర్ డూపర్ హిట్ కొట్టిన ఉప్పెన సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. మెగా ఫ్యామిలీ హీరో పంజా వైష్ణవ్ తేజ్ తొలిసారిగా హీరోగా పరిచయమైన ఈ మూవీకి బుచ్చిబాబు సన దర్శకత్వం వహించగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకోవడంతో పాటు ముఖ్యంగా యువతలో మరింత క్రేజ్ దక్కించుకుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమా సక్సెస్ కి మరింతగా హెల్ప్ అయిందనే చెప్పాలి.

హృద్యమైన ప్రేమ కథగా పలు యాక్షన్ తో పాటు ఎమోషనల్ సన్నివేశాలతో కూడిన మూవీగా దీనిని తెరకెక్కించి ఆడియన్స్ నుంచి మార్కులు దక్కించుకున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. ఇక తొలి సినిమా అయినప్పటికీ కూడా హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోయిన్ కృతి శెట్టి ఇద్దరూ కూడా ఎంతో అద్భుతంగా నటించి మంచి క్రేజ్ దక్కించుకున్నారు. ఇక ప్రస్తుతం ఉప్పెన మూవీ యూనిట్ పలు ప్రాంతాలకు సక్సెస్ యాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఆ విధంగా తొలి సినిమాతోనే హీరోయిన్ గా సూపర్ క్రేజ్ దక్కించుకున్న కృతి శెట్టి ప్రస్తుతం వరుసగా ఒకదాని వెంట మరొకటి అవకాశాలు అందుకుంటూ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుధీర్ బాబు తో ఒక సినిమా అలానే నానితో శ్యామ సింగ రాయ్ అనే సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది కృతి. మరోవైపు ఆమెను హీరోయిన్ గా తీసుకునేందుకు పలువురు దర్శక నిర్మాతలు ఇప్పటికే క్యూ లైన్స్ లో ఉన్నారని ఆ విధంగా ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయని అంటున్నారు. మొత్తంగా చూస్తుంటే రాబోయే మరికొద్దిరోజుల్లో స్టార్ హీరోయిన్ సమంత మాదిరిగా కృతి శెట్టి కూడా స్టార్ నటిగా మంచి క్రేజ్ దక్కించుకొని హీరోయిన్ గా ఉన్నత శిఖరాలు అధిరోహించే ఛాన్స్ ఉందని అంటున్నారు విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: