సినీ పరిశ్రమలో ఫ్యామిలీ బ్యా గ్రౌండ్ ఉన్న కొంతమంది హీరోలకు ఆశించిన ఫలితం దక్కలేదు. బ్రహ్మానందం కొడుకు గౌతమ్ పల్లకిలో పెళ్లికూతురు, వారెవా, బసంతి లాంటి సినిమాల్లో నటించారు. 2018లో విడుదలైన మను సినిమాలో నటించారు గౌతమ్. సూపర్ స్టార్ కృష్ణ గారి కొడుకైన రమేష్ బాబు కొన్ని సినిమాల్లో హీరోగా నటించారు. తర్వాత నటన నుంచి దూరమయ్యారు. మహేష్ బాబు హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అతిథి సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు రమేష్ బాబు.

ప్రముఖ కమెడియన్ ఎమ్మెస్ నారాయణ కొడుకైన విక్రమ్ కొడుకు సినిమాతో హీరోగా అడుగుపెట్టారు. తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించారు విక్రమ్. అఖిల్, సిసింద్రీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. తర్వాత మనం సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. అఖిల్ సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. తర్వాత హలో, మిస్టర్ మజ్ను సినిమాల్లో నటించారు. అఖిల్ తర్వాత సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టీజర్ ఇటీవల విడుదలైంది.

అయితే గౌరవం సినిమాతో హీరోగా అడుగు పెట్టిన అల్లు శిరీష్ తర్వాత కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం సినిమాల్లో నటించారు. అలాగే ఒక మలయాళం సినిమాలో కూడా నటించారు. అల్లు శిరీష్ చివరిగా 2019లో వచ్చిన ఏబిసిడి సినిమాలో కనిపించారు. కాళిదాసు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుశాంత్ తర్వాత కరెంట్, ఆటాడుకుందాం రా, ఇంకా కొన్ని సినిమాల్లో హీరోగా నటించారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన చిలసౌ సినిమాతో విజయాన్ని అందుకున్నారు. తర్వాత అలా వైకుంఠపురంలో సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించారు. ప్రస్తుతం సుశాంత్ ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు.

ఇక ఒకటో నెంబర్ కుర్రాడు, యువరత్న, తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన తారకరత్న అమరావతి సినిమాతో విలన్ గా కూడా నటించారు. ఆ తర్వాత మనమంతా సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించారు. దర్శకరత్న దాసరి నారాయణరావు కొడుకైన దాసరి అరుణ్ కుమార్ గ్రీకు వీరుడు, ఇంకా ఎన్నో సినిమాల్లో నటించారు. వాటిలో కొన్ని రిజిస్టర్ అవ్వగా ఇంకొన్ని విజయం సాధించలేదు.  అల్లు శిరీష్ హీరోగా నటించిన ఒక్క క్షణం సినిమాలో విలన్ పాత్ర పోషించారు అరుణ్ కుమార్. 

మరింత సమాచారం తెలుసుకోండి: