ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సర్కారు వారి పాట. 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల దుబాయ్ లో ఎంతో గ్రౌండ్ లెవెల్లో జరిగింది. తొలిసారిగా సూపర్ స్టార్ కి జోడిగా కీర్తి సురేష్ నటిస్తున్న ఈ సినిమాకి యువ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తుండగా మది ఫోటోగ్రఫీ అందిస్తున్నారు.

గీతగోవిందం ఫేమ్ పరశురామ్ పెట్ల తొలిసారిగా మహేష్ తో చేస్తున్న సినిమా కావడంతో మహేష్ బాబు అభిమానులతోపాటు సాధారణ ఆడియన్స్ లో కూడా దీని పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి అందరి నుంచి సూపర్ రెస్పాన్స్ రావడంతో పాటు అది మూవీ పై భారీగా అంచనాలు క్రియేట్ చేసింది. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా జనవరిలో రిలీజ్ కానుంది. అయితే దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో కె.ఎల్.నారాయణ నిర్మాతగా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే.

మరోవైపు ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కిస్తున్నారు. అయితే ఆ సినిమా పూర్తవడానికి ఇంకా చాలానే సమయం ఉండటంతో ఈలోపు మరో సినిమాను మహేష్ బాబు చేసే అవకాశం ఉందట. ఇక ఇప్పటికే పలువురు దర్శకులు మహేష్ ను కలిసి కథలు వినిపిస్తున్నారని అంటున్నారు. ఆ విషయం అటుంచితే ఈ రెండు సినిమాల అనంతరం తదుపరి రాజమౌళి తో చేయబోయే మహేష్ బాబు సినిమా 2022 ద్వితీయార్థంలో ప్రారంభం అయి 2025 ప్రథమార్ధంలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్. దాదాపుగా తన సినిమా కోసం మూడేళ్లకు పైగా సమయం తీసుకునే రాజమౌళిమూవీ కోసం కూడా ఇంచుమించు అంతే సమయం తీసుకునే ఛాన్స్ ఉందని, మొత్తంగా చూస్తుంటే ఆ మధ్య మూడేళ్ల కాలం మహేష్ ఫ్యాన్స్ కి ఒకింత గడ్డుకాలం అని అప్పటి వరకూ వారు వెయిట్ చేయక తప్పదని అంటున్నారు విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: