మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఊహించని విధంగా భారీ డిజాస్టర్ ను చవిచూసిన విషయం తెలిసిందే. అయితే దాని తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. మెగా డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా శ్రీయ శరణ్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు.

కీరవాణి సంగీతాన్ని సాయిమాధవ్ బుర్రా మాటలని అందిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల రిలీజ్ అయిన ఇద్దరు హీరోల పరిచయ టీజర్లు సూపర్ రెస్పాన్స్ దక్కించుకొని సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. అయితే దీని తర్వాత మరొక సూపర్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్సినిమా చేయనున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమా యొక్క అధికారిక ప్రకటన ఇటీవల రావడం జరిగింది.

అయితే దాని తర్వాత కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై జెర్సీ మూవీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఒక సినిమా చేయనున్నారని ఇప్పటికే ఈ సినిమా యొక్క కథాకథనాలు సిద్ధమయ్యాయని అతి త్వరలో దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుందని అంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం దాదాపుగా రూ.200 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుందని ఈ విధంగా ఆర్ఆర్ఆర్ ఆ తర్వాత వరుసగా ఒకదాని వెంట మరొకటి చరణ్ పాన్ ఇండియా సినిమాలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారని చెబుతున్నారు. మొత్తంగా చూస్తుంటే ఇది నిజంగా రాంచరణ్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పక తప్పదు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: