కీరవాణి సంగీతాన్ని సాయిమాధవ్ బుర్రా మాటలని అందిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల రిలీజ్ అయిన ఇద్దరు హీరోల పరిచయ టీజర్లు సూపర్ రెస్పాన్స్ దక్కించుకొని సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. అయితే దీని తర్వాత మరొక సూపర్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమా యొక్క అధికారిక ప్రకటన ఇటీవల రావడం జరిగింది.
అయితే దాని తర్వాత కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై జెర్సీ మూవీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఒక సినిమా చేయనున్నారని ఇప్పటికే ఈ సినిమా యొక్క కథాకథనాలు సిద్ధమయ్యాయని అతి త్వరలో దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుందని అంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం దాదాపుగా రూ.200 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుందని ఈ విధంగా ఆర్ఆర్ఆర్ ఆ తర్వాత వరుసగా ఒకదాని వెంట మరొకటి చరణ్ పాన్ ఇండియా సినిమాలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారని చెబుతున్నారు. మొత్తంగా చూస్తుంటే ఇది నిజంగా రాంచరణ్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పక తప్పదు.....!!