ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ హీరోగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట మూవీ పై టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ అలానే సూపర్ స్టార్ మహేష్ అభిమానుల్లోనూ భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. తొలిసారిగా తనకు ఎంతో ఇష్టమైన మహేష్ తో సినిమా చేస్తుండడం తో దర్శకుడు పరశురామ్సినిమా ఒక కథాకథనాల విషయమై ఎంతో జాగ్రత్త వహిస్తున్నారని అంటున్నారు.

బ్యాంకుల్లోని మోసాలు, కుంభకోణాల నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి ఎంతో భారీగా గ్రాండ్ లెవల్లో నిర్మిస్తున్నాయి. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి మది ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఇటీవల దుబాయ్ లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ గోవా లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కాగా మహేష్ బాబు ఈ మూవీలో ఒక ఫైనాన్షియర్ పాత్రలో కనిపించనుండగా హీరోయిన్ కీర్తిసురేష్ బ్యాంకు ఉద్యోగిని పాత్రలో కనిపించనుందని సమాచారం. ఇక దీని తర్వాత మహేష్ బాబు, యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. మరోవైపు తన నెక్స్ట్ సినిమా మహేష్ బాబు తోనే అంటూ ఇటీవల రాజమౌళి ఒక ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

అయితే ప్రస్తుతం ఆయన ఆర్.ఆర్. ఆర్ మూవీ తో ఫుల్ గా బిజీగా ఉండటంతో సర్కారువారు పాట పూర్తయ్యేలోపు వెంటనే మరో సినిమా చేసేందుకు మహేష్ ఆసక్తి చూపిస్తున్నారని ఇటీవల తనతో సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన అనిల్ రావిపూడి రెండు రోజుల క్రితం మహేష్ కి ఒక అద్భుతమైన స్టోరీ లైన్ వినిపించారని అంటున్నారు. మంచి ఎక్స్ పెరిమెంటల్ మూవీగా డిఫరెంట్ జానర్లో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక న్యూస్ అతి త్వరలో రానుందని చెబుతున్నారు. అయితే ఈ మూవీ పక్కాగా రాజమౌళి సినిమా కంటే ముందే మొదలవుతుందా లేక తర్వాత మొదలవుతుందా అనే దానిపై మాత్రం ఇంకా పూర్తి క్లారిటీ రావలసి ఉందని చెబుతున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: