ప్రస్తుతం వరుసగా కెరీర్ పరంగా సక్సెస్ లతో దూసుకెళ్తున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గీతా గోవిందం ఫేమ్ పరుశురాం దర్శకత్వంలో నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. తొలిసారిగా మహేష్ కు జోడిగా కీర్తి సురేష్ నటిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తుండగా 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్ జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి ఈ మూవీని ఎంతో భారీగా నిర్మిస్తున్నాయి. ఇటీవల దుబాయ్ లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ గోవాలో జరగనున్నట్లు తెలుస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇందులో ఒక ఫైనాన్షియర్ గా నటిస్తుండగా ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడు విలన్ గా చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అందరి నుంచి సూపర్ రెస్పాన్స్ దక్కించుకోవడంతో పాటు సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు కూడా పెంచింది. ఇప్పటి వరకూ తాను చేసిన కథలన్నీ ఒక ఎత్తయితే ఈ సినిమా మరొక ఎత్తని తప్పనిసరిగా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఈ మూవీ రిలీజ్ తర్వాత ఎంతో ఆకట్టుకుంటుందని సర్కారు వారి పాట పై దర్శకుడు పరుశురాం ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే లేటెస్ట్ గా కొన్ని ఫిలిమ్ నగర్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు డ్యూయల్ రోల్ చేస్తున్నారని అంటున్నారు. అయితే ఈ విషయమై మరొక వార్త కూడా ప్రచారం అవుతుంది, నిజానికి మహేష్ బాబు ఇందులో చేస్తున్న పాత్ర ఒకటే అని, కానీ మూవీ లో ఆ పాత్రకు రెండు రకాల షేడ్స్ ఉంటాయని అంటున్నారు. మొత్తంగా సర్కారు వారు పాటు సినిమాకు సంబంధించి ప్రచారం అవుతున్న ఈ వార్తల ప్రకారం అసలు మహేష్ బాబు ఇందులో సింగిల్ రోల్ చేస్తున్నారా లేక డబుల్ రోలా అనేదానిపై అందరిలోనూ ఎంతో ఉత్కంఠ నెలకొంది. మరి దీనికి పూర్తిస్థాయిలో తెర పడాలి అంటే ఈ మూవీ రిలీజ్ సమయం వరకు వేచి చూడక తప్పదు అని అంటున్నారు విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: