గ్రహణం మూవీతో డైరెక్టర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఇంద్రగంటి మోహన కృష్ణ..మొదటి మూవీ తోనే నంది పురస్కారం తో పాటు పదకొండు పురస్కారాలు అందుకొని వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత మాయాబజార్, అష్టా చెమ్మా, గోల్కొండ హైస్కూల్, జెంటిల్ మాన్, అమీ తుమీ ఇలా వరుసగా విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నాడు. ఇంద్రగంటి నుండి మూవీ అంటే ఓ కొత్తదనం ఉంటుందని అంత ఫిక్స్ అయ్యేలా పేరు తెచ్చుకున్నాడు.

2018 లో సుధీర్ బాబు తో సమ్మోహనం మూవీ చేసాడు. అప్పటివరకు డిఫరెంట్ కథలతో వచ్చిన ఇంద్రగంటి ..సమ్మోహనం మూవీ ని మాత్రం ప్రేమ కథ తో వచ్చి తనలో ఓ ప్రేమికుడు కూడా దాగివున్నాడని చెప్పకనే చెప్పాడు. ఈ మూవీ చూసిన వారంత ఇది ఇంద్రగంటి మూవీనా అని ఆశ్చర్య పోయేలా తీసి సక్సెస్ అందుకున్నాడు. ఈ మూవీ ద్వారా సుధీర్ బాబు కు కూడా మంచి ఇమేజ్ దక్కింది. ఈ మూవీ సక్సెస్ తో తన క్రేజ్ పెంచేసుకున్న ఇంద్రగంటి..ఆ తర్వాత నాని - సుధీర్ బాబు లతో వి అనే యాక్షన్ మూవీ చేసాడు.

మూవీ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ మొదటి రోజే ఈ మూవీ కి నెగిటివ్ టాక్ వచ్చి, ఇంద్రగంటి కి చెడ్డ పేరు తీసుకొచ్చింది. ఈ మూవీ ఫలితం తో మళ్లీ తన పాత పద్ధతిలోకి వెళ్ళాడు. సమ్మోహనం మాదిరి ప్రేమ కథ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుధీర్ బాబు ను హీరోగా పెట్టి తీసిన ఈ మూవీ తాలూకా ఫస్ట్ లుక్ మార్చి 01 న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భాంగా ఓ చిన్న వీడియో రిలీజ్ చేసి సినిమా ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పాడు.

ఈ వీడియో లో సుధీర్ బాబుఓ థియేటర్ ప్రొజెక్షన్ రూంలో నిలుచుని ప్రేమ కథలు నచ్చని మనుషులు ఉండరేమో కదా..ప్రేమ లేని జీవితం ఉండదు కదా.. అయితే నాలాంటి అబ్బాయి తాను ప్రేమించిన అమ్మాయి గురించి మొట్ట మొదటిసారి ఎవరికైనా చెప్పాల్సి వస్తే ఎలా మొదలుపెడతాడు అంటూ చెప్పి సినిమా ఆసక్తి పెంచాడు. ఈ మూవీ లో సుధీర్ కు జోడిగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా..బెంచ్మార్క్ స్టూడియోస్ బ్యానర్ ఫై నిర్మితమవుతుంది. ఈ మూవీ తో ఇంద్రగంటి గట్టి హిట్ కొట్టడం గ్యారెంటీ అనిపిస్తుంది.


 
 

మరింత సమాచారం తెలుసుకోండి: