సూపర్ స్టార్ మహేష్ బాబు, దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ల తొలి క్రేజీ కాంబినేషన్ లో రాబోయే సినిమాకు సంబంధించి ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు జోరుగా ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. నిజానికి వీరిద్దరి కలయికలో ఎప్పుడో సినిమా రావాల్సి ఉండగా కొన్నేళ్ల నుంచి ఇద్దరు కూడా ఎవరికి వారు తమ కమిట్ మెంట్స్ తో బిజీగా ముందుకు సాగుతుండటంతో ఫైనల్ గా ఇప్పటికి వీరి కాంబో మూవీ సెట్ అవ్వడం జరిగింది.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన కె.ఎల్.నారాయణ నిర్మాతగా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీ గా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి భారీ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. తన నెక్స్ట్ మూవీ పక్కాగా మహేష్ బాబు తోనే ఉంటుందని ఇటీవల మీడియా ఛానల్ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన ప్రకటించారు. అయితే తొలిసారిగా మహేష్ తో చేస్తున్న సినిమా కావడం మరోవైపు మహేష్ కి సౌత్ లోని ఇతర భాషలతో పాటు నార్త్ సహా పలు దేశాల్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉండటంతో ఈ మూవీ యొక్క సబ్జెక్టుని ఎంతో గ్రాండ్ లెవల్లో ఉండేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఇటీవలే ఈ మూవీ ఒక కథకుడు విజయేంద్ర ప్రసాద్ చెప్పిన మాటల బట్టి చూస్తుంటే ఈ సినిమా సౌత్ ఆఫ్రికా లోని దట్టమైన అడవుల నేపథ్యంలో మంచి యాక్షన్ తో కూడిన ఎడ్వంచరస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా పలు టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ మూవీలో చాలా మంది హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేయనున్నారని అలానే ఇద్దరు ప్రముఖ హాలీవుడ్ స్టార్స్ కూడా ఇందులో ముఖ్య పాత్రలు చేయనున్నారని అంటున్నారు. అతి త్వరలో ఈ సినిమా యొక్క పూర్తి కథ సిద్ధమవుతుందని దాని అనంతరం ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా బయటకు వస్తాయని అంటున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే అతి త్వరలో తెరకెక్కనున్న మహేష్, రాజమౌళి కాంబో సినిమా తప్పకుండా రిలీజ్ తర్వాత భారీ రికార్డ్స్ ని దక్కించుకోవడం ఖాయం గా కనపడుతోంది అని అంటున్నారు విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: