సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపుడి కాంబినేషన్ లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా షూటింగ్ టైం లో మరో కథ చెప్పాడట. ఆ కథ కూడా మహేష్ కు నచ్చిందట. సరిలేరు తర్వాత పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. అయితే మహేష్ రాజమౌళి సినిమా ముందు మరో సినిమా చేయాలని చూస్తున్నాడట.

అది అనీల్ రావిపుడి డైరక్షన్ లోనే ఉంటుందని తెలుస్తుంది. అనీల్ రావిపుడి డైరక్షన్ లో మహేష్ బాబు మరో సినిమా అంటే తప్పకుండా మళ్లీ పక్కా హిట్ కొట్టే అవకాశం ఉంది. సరిలేరు నీకెవ్వరు సినిమా తరహాలోనే మహేష్ తో అనీల్ రావిపుడి చేసే నెక్స్ట్ సినిమా కూడా ఎంటర్టైన్మెంట్ తో పాటుగా మహేష్ ఫ్యాన్స్ కోరుకునే కమర్షియల్ అంశాలు కూడా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ రాజమౌళి డైరక్షన్ లో సినిమాతో పాటుగా ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా చేయాలని చూస్తున్నాడు. తప్పకుండా మహేష్, రాజమౌళి ఇద్దరు మరో సెన్సేషనల్ సినిమా చేయాలని చూస్తున్నాడు. శివాజి కథతో ఈ సినిమా చేస్తారని అంటున్నారు. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్లతో దూసుకెళ్తున్న మహేష్ తన నెక్స్ట్ సినిమాలతో కూడా అదే ఫాం కొనసాగించాలని చూస్తున్నాడు.  మహేష్ సినిమా హిట్టైతే ఆ లెక్క ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే.                                                              

మరింత సమాచారం తెలుసుకోండి: