రాజమౌళి మహేష్మూవీ ప్రాజెక్ట్ గురించి ఇప్పటి వరకు అనేక వార్తలు వచ్చాయి. ‘ఆర్ ఆర్ ఆర్’  తరువాత ఈ మూవీ ప్రాజెక్ట్ మొదలు అవుతుందని ఇప్పటికే ఈ సినిమా కధకు సంబంధించిన ప్రాధమిక చర్చలు రాజమౌళి విజయేంద్ర ప్రసాద్  ల మధ్య జరిగాయి అన్న వార్తలు కూడ వచ్చాయి. ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపధ్యంలో హాలీవుడ్ రేంజ్ లో  ఒక స్పై థ్రిల్లర్ గా ఈమూవీ కథ ఉంటుంది అన్న లీకులు కూడ వచ్చాయి.


అయితే ఇండస్ట్రీ వర్గాలలో ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ మూవీ ప్రాజెక్ట్ ఇప్పట్లో మొదలుకాదనీ ఈ మూవీ మొదలు కావడానికి మరొక రెండు సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యం లేదు అన్న వార్తల హడావిడి మొదలైంది. దీనికి కారణం ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలైన తరువాత రాజమౌళి కనీసం 6 నెలలు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు టాక్.


ముఖ్యంగా ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రీకరణ విషయంలో అనుకోకుండా ఏర్పడ్డ అనేక అడ్డంకులు రాజమౌళిని మానసికంగా చాల ఇబ్బంది పెట్టడంతో ఈమూవీ విడుదల తరువాత ప్రమోషన్ కార్యక్రమాలు ముగించి కనీసం 6 నెలలు విశ్రాంతి తీసుకున్న తరువాత మాత్రమే మహేష్ ప్రాజెక్ట్ గురించి పూర్తిగా రంగంలోకి దిగాలని జక్కన్న ఆలోచన అని తెలుస్తోంది. దీనికితోడు మహేష్ మూవీని ఎక్కువ భాగం ఆఫ్రికన్ అటవీ ప్రాంతంలో షూట్ చేయవలసిన పరిస్థితులలో ఈ విషయమై చాల శ్రమ ఉంటుంది కాబట్టి కొంత గ్యాప్ తీసుకుని మాత్రమే మహేష్ మూవీ వైపు అడుగులు వేయాలని జక్కన్న ఆలోచన అని అంటున్నారు.


ఇప్పుడు ఈ విషయాలు అన్నీ మహేష్ దృష్టి వరకు వెళ్ళడంతో ప్రిన్స్ ప్రస్తుతం తాను నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్ పూర్తి అయిన తరువాత రాజమౌళి సిద్దపడే వరకు వచ్చే గ్యాప్ లో మరో రెండు సినిమాలు పూర్తి చేయాలని మహేష్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో అనిల్ రావిపూడి వెంకీ కుడుమల సుకుమార్ కొరటాల శివ లలో ఎవరైన ఇద్దరితో రెండు సినిమాలు పూర్తి చేయాలని మహేష్ మాష్టర్ ప్లాన్ అని తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: