ఇక దర్శకుడు కూడా ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలనే ప్లాన్ లో ఉన్నాడు. అందుకే ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు గుణశేఖర్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అలాగే సమంత కూడా ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నానని వెళ్లడించారు. అందుకోసమే ఈ సినిమాలో సామ్ లుక్ పరంగా ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నానని.. సామ్ తాజాగా వెళ్లడించారు. దీంతో పాటుగా స్క్రిప్టు పేపర్ పెన్ ఉన్న పిక్ ను కూడా సామ్ ప్రేక్షకులతో పంచుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే శకుంతల సినిమాకు సామంత జేగంట మోగించినట్టే కనిపిస్తోంది.
ఈ సినిమాతో పాటుగా సామ్ తన తర్వాత సినిమా కోసం కూడా ప్రిపేర్ అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లోనే ఈ అమ్మడు ‘జాంబీ’ మూవీలో నటిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజమనేది ప్రశాంత్ వర్మనే స్వయానా వివారాల్ని వెల్లడించాలి మరి. వీటితో పాటుగా అక్కినేని వారి కోడలు తమిళంలో నయనతార, విజయ్ సేతుపతిలో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. అలాగే మాయ ఫేం శక్తి శరవణన్ డైరెక్షన్ లోనూ సమంత ఓ సినిమా చేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి.