ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతార.. అదే చిత్ర పరిశ్రమకి చెందిన యువ దర్శకుడు విగ్నేష్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.. చాలా రోజులుగా వీరిద్దరు బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఎక్కడ చూసినా వీరి హంగామే కనిపిస్తుంది. పెళ్లెప్పుడు చేసుకుంటారని అడిగితే డేటింగ్‌ బోర్‌ కొట్టినప్పుడు చేసుకుంటామని చెబుతున్నారు. కానీ ఇప్పుడు బోర్‌ కొట్టినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే త్వరలోనే వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారు. ఇప్పటికే వీరిద్దరు అనధికారికంగా కలిసే ఉంటున్నారని టాక్‌. కానీ త్వరలో అధికారికంగా ఒక్కటి కాబోతున్నారట.

మార్చి నెలలో పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు టాక్‌. ఇటీవల వీరిద్దరు జ్యోతిష్కుడిని సంప్రదించగా, ఆయన మార్చిలో ముహూర్తం ఫిక్స్ చేసినట్టు సమాచారం.క్రిస్టియన్‌ సాంప్రదాయంలో జరుగుతుందా, లేక హిందూ సాంప్రదాయంగా జరుగుతుందా? అనేది డౌట్‌గా మారింది. అయితే ప్రస్తుతం మాత్రం నయనతార, విగ్నేష్‌ శివన్‌ ఫ్యామిలీ లైఫ్‌లోకి అడుగుపెడుతున్నారనే వార్త మాత్రం హాట్‌ టాపిక్‌గా మారింది. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఇప్పటికే నయనతార శింబు, ప్రభుదేవాలతో ప్రేమాయణం సాగించింది. ప్రభుదేవాతో ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. త్వరలోనే మ్యారేజ్‌ జరగబోతుందన్న క్రమంలోనే వీరిద్దరు విడిపోయారు.

రెండుసార్లు బ్రేకప్‌ అయిన నయన్ కి, ఈ సారైనా తన పెళ్లి కల నెరవేరుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే దర్శకుడిగా రాణిస్తున్న విగ్నేష్‌.. నయనతార కంటే వయసులో చిన్నవాడైన విషయం తెలిసిందే. ప్రస్తుతం నయనతార..విగ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో `కాథు వాకుల రెండు కాదల్‌`, నెట్రీకన్ అనే ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీలో కూడా నటిస్తోంది.ఇక తెలుగులో కూడా మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే అవకాశం ఈ అమ్మడికి దక్కినట్లు తెలుస్తోంది.. చిరూ నెక్స్ట్ ప్రాజెక్ట్ లూసిఫార్ రీమేక్ లో నయనతార హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: