నాగచైతన్య సాయి పల్లవి ప్రధానపాత్రలో లవ్ స్టోరీ పేరుతో శేఖర్ కమ్ముల హైదరాబాద్ నేపథ్యంలో ఓ ప్రేమకథను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 16న థియేటర్లలో విడుదల కానుంది. నీతో ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో పాటను విడుదల చేస్తూ మూవీపై అంచనాలు పెంచుతున్నారు దర్శక నిర్మాతలు. అందులో భాగంగా తాజాగా సారంగదరియా అంటూ సాగిపోయే పాటను విడుదల చేసింది చిత్రబృందం.
ఈ పాటను సమంత తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేసి ఆల్ ది బెస్ట్ చెప్పింది. ashok TEJA' target='_blank' title='సుద్దాల అశోక్ తేజ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సుద్దాల అశోక్ తేజ రచించిన ఈ పాటను తీన్మార్ మంగ్లీ పాడింది. సారంగదరియా అంటూ ఈ సాగే ఈ మాస్ బీట్ కు సాయి పల్లవి అదిరిపోయే స్టెప్పులు వేసి అదరగొట్టింది. త్వరలో సాయి పల్లవి తన మాస్ చెప్పులతో అదరగొట్టింది అని చెప్పొచ్చు. హైదరాబాద్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చేయొద్దు సాయిపల్లవి ఇద్దరు తెలంగాణ యాసలో మాట్లాడుతున్నారు.
సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నారాయణ దాస్ కె. నారంగ్ పుష్కర రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ శిష్యుడు పవన్ చిల్లం సంగీతం అందిస్తున్నాడు. గతంలో కూడా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ లో తెరకెక్కించారు శేఖర్ కమ్ముల. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఆనంద్ ఈ సినిమాతో శేఖర్ తెలుగువారికి కొత్త రకమైన సినిమాను పరిచయం చేశాడు. ఆయన సునిశితమైన కథలతో సహజమైన సన్నివేశాలతో మనుషులను హత్తుకునే మాటలతో మంచి కాఫీ లాంటి చిత్రాలను తీస్తూ తెలుగువారి హృదయాలను దోచుకుంటున్నాడు.