రకుల్ ప్రీత్ సింగ్ ఈ ముద్దుగుమ్మ కెరటం మూవీ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.2011 న తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ తరువాత సినిమాలు తీస్తూ తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించుకుంది. ఆ తర్వాత తన అందం నటనతో వరుసగా  అవకాశాలు దక్కించుకుంది. సారీ హీరోలతో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 రకుల్ ప్రీత్ సింగ్ హీరోల సరసన నటిస్తూ అధరగొట్టింది. ఇందులో భాగంగా లౌక్యం నాన్నకుప్రేమతో ధ్రువ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రాకుల్. ఆ మధ్య ఈ భామ కూడా ఎడాపెడా నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనండంతో అవకాశాలు తగ్గాయి. దీనితో  రకుల్ ప్రీత్ సింగ్ పాత్రల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది.


 ఇటీవల బాలీవుడ్ డ్రగ్ కేసులో రకుల్ ను అధికారులు ప్రశ్నించిన  సంగతి తెలిసిందే. అది అలా ఉంటే రకుల్ ఓ వైపు తెలుగులో నటిస్తూనే హిందీలో కూడా అప్పుడప్పుడు మెరుస్తోంది. అది ఎలా ఉంటే తాజాగా రాహుల్ నితిన్ చెక్ సినిమాలో నటించింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించింది. దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి గురించి మాట్లాడుతూ ఆయన గతంలో చేసిన రెండు సినిమాలలు నేను చూశాను. ఇక ఆయన నుంచి ఫోన్ రాగానే కచ్చితంగా నా పాత్ర కొత్త రకంగా ఉంటుందని అనుకున్నాను అని చెప్పింది. చెక్ కథ నచ్చడం మిగతా విషయాలేవీ ఆలోచించకుండా ఒప్పుకున్నాను అని తెలిపింది. సినిమా చూసిన వారు లాయర్ మానస పాత్రలో నా నటన చాలా బాగుందని అంటున్నారు.


 రకుల్ ఇంకా మాట్లాడుతూ క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ తో వస్తున్న సినిమా గురించి మాట్లాడింది. ఆ సినిమాలో తన పాత్ర ఇంకా కొత్తగా ఉంటుందని తెలిపింది. ఈ సినిమా కొండపొలం అనే నవల ఆధారంగా తెరకెక్కింది. సినిమాలో రకుల్ డి గ్లామర్ పాత్రలో కనిపించనుందట. ఇక తన వ్యాపారం గురించి మాట్లాడిన రకుల్ లాక్ డౌన్ ప్రభావం నా జిమ్ వ్యాపారం పై బాగానే పడింది. అయితే కరోనా కారణంగా కొన్నాళ్లపాటు జిమ్ లు మూతపడిన అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు మాత్రం ఆపలేదని తెలిపింది. కాగా ప్రస్తుతం మాత్రం మళ్లీ జిమ్ వ్యాపారం ఊపు అందుకుందని తెలిపింది రకుల్.

మరింత సమాచారం తెలుసుకోండి: