టాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న పూజా హెగ్దే ఒకేసారి రెండు మూడు సినిమాలు చేసే రేంజ్ లో ఉంది. ఒక సినిమా ఫినిష్ అవడమే ఆలస్యం మరో సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. ఆమె డేట్స్ కోసం షెడ్యూల్ అడ్జెస్ట్ మెంట్స్ కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. టాలీవుడ్ లో బుట్ట బొమ్మ క్రేజ్ రోజు రోజుకి పెరుగుతుంది. అల వైకుంఠపురంలో తర్వాత ప్రభాస్ తో రాధే శ్యాం సినిమా చేస్తుంది పూజా హెగ్దే.

ఈ సినిమాతో పాటుగా అఖిల్ బ్యాచ్ లర్ సినిమా కూడా లైన్ లో ఉంది. ఈ ఇయర్ లో ఆ రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక వీటితో పాటుగా మరో రెండు భారీ సినిమాలు చేస్తుందని తెలుస్తుంది. ఇదిలాఉంటే పూజా హెగ్దే తెలుగు హీరో బాలీవుడ్ లో చేస్తున్న ప్రాజెక్ట్ కు నో చెప్పిందని తెలుస్తుంది.

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఛత్రపతి రీమేక్ సినిమా షురూ చేశారు. వినాయక్ డైరక్షన్ లో తెరకెక్కే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు చేసేందుకు ముందుకు రావట్లేదని తెలుస్తుంది. ఆల్రెడీ వరుస సినిమాలతో బిజీగా ఉన్న పూజా కూడా బెల్లంకొండ బాబుకి సారీ అనేసిందట. ఇద్దరు కలిసి సాక్ష్యం సినిమాలో నటించారు. కాని బాలీవుడ్ సినిమాలో మాత్రం ఆమె ఛాన్స్ లేదని చెప్పేసిందట. తెలుగులో తను తీసే సినిమాల్లో ఇక్కడ స్టార్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేసిన బెల్లంకొండ బాబు అక్కడ హీరోయిన్ దొరక్క ఇబ్బంది పడుతున్నాడని టాక్. విజయ్ దేవరకొండ లైగర్ హీరోయిన్ అనన్యా పాండేని కూడా చర్చల్లో ఉన్నట్టు తెలుస్తుంది.                                               

మరింత సమాచారం తెలుసుకోండి: